సీఎం ధైర్యాన్ని మెచ్చుకుంటున్న జనం | Sakshi
Sakshi News home page

సీఎం ధైర్యాన్ని మెచ్చుకుంటున్న జనం

Published Thu, Nov 16 2023 6:14 AM

-

‘మీ కుటుంబానికి ఈ ప్రభుత్వం వల్ల మేలు జరిగిందీ అంటే మళ్లీ మాకు ఓటెయ్యండి’ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాట ఇది. మేలు జరిగి ఉంటే ఓటెయ్యండని అడిగిన ఏకై క ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన మాటలపై రాష్ట్రవ్యాప్తంగా బాగా చర్చ జరుగుతోంది. ఇలా అడగటానికి ఎంతో దమ్ము, ధైర్యం ఉండాలి. జగనన్న నాయకత్వంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో ఇచ్చిన హామీలు, ఎన్నికల్లో విడుదల చేసిన మేనిఫెస్టోలో పేర్కొన్న సంక్షేమ పథకాలు తూచా తప్పకుండా అమలు చేసింది గనుకనే అలా అనగలిగారు అని జనం చెప్పుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, మేనిఫెస్టో గాలికొదిలేసి ప్రజలను మోసం చేసింది. కానీ ఈ సీఎం జగన్‌ మాత్రం చెప్పినవి చెప్పినట్టుగా నీతిగా, నిజాయితీగా, అవినీతి రహితంగా అన్ని పథకాలు అమలు చేశారు. అందుకే మళ్లీ ఓటు అడిగే హక్కు, అర్హత ఈ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వానికే ఉంది. యస్‌ ఆ పథకాల ద్వారా మన ప్రతీ కుటుంబంలో ఇద్దరికి పైగా ఆర్థిక లబ్ధి పొందాం. కాబట్టి నీతి, నిజాయితీకి కట్టుబడి మళ్లీ జగన్‌కే ఓటు వెయ్యాల్సిన బాధ్యత మనపై ఉంది. అని ఎక్కడికక్కడ జనవాక్కుగా వినిపిస్తోంది.

Advertisement
Advertisement