కాకినాడ రూరల్: మహాశక్తియాగం జరుగుతున్న కాకినాడ రమణయ్యపేటలోని శ్రీపీఠం భక్తజనసంద్రంగా మారుతోంది. ఈ మహాయాగానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామీజీ పర్యవేక్షణలో ఈ యాగం ఈ నెల 14న ప్రారంభమైన విషయం తెలిసిందే. యాగంలో భాగంగా అష్టాదశ శక్తి పీఠాల్లో కొలువై ఉన్న ఆదిపరాశక్తిని ఒకేచోట మహాశక్తిగా ఆవిష్కరించే అద్భుత ఘట్టంగా శతకోటి లలితా కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. రోజూ 10 వేల నుంచి 12 వేల మందితో నెల రోజుల పాటు కుంకుమార్చనలు నిర్వహించాలని తలపెట్టారు. అయితే 15 వేలకు మందికి పైగా మహిళలు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. యాగం ఆరో రోజైన ఆదివారం యాగశాలలో ఉదయం నక్షత్ర పూజ, తిథి దేవత పూజ నిర్వహించారు. అనంతరం జరిగిన లలితా కుంకుమార్చనలకు పెద్ద సంఖ్యలో మహిళలతో పాటు పురుషులు కూడా హాజరయ్యారు. మూడుసార్లు లలితా నామార్చనలతో కుంకుమార్చనలు చేశారు. వచ్చిన భక్తులందరికీ అన్నదానం చేశారు. దీనికోసం వలంటీర్లు శ్రమిస్తున్నారు. దీపోత్సవ వేదికపై సాయంత్రం శోభారాజ్ బృందం ఆలపించిన కర్నాటక సంగీతం శ్రోతలను అలరించింది. పార్వతీ పరమేశ్వరులను పల్లకీ సేవతో ఊరేగింపుగా దీపోత్సవ వేదిక వద్దకు తీసుకువచ్చిన అనంతరం పరిపూర్ణానంద స్వామి అనుగ్రహ భాషణం చేశారు. అనంతరం భక్తుల చేతులు మీదుగా దీపోత్సవం చేశారు. దీపకాంతులతో శ్రీపీఠం వెనుక ఉన్న గోశాల ప్రాంగణం వెలుగులతో నిండిపోయింది.
శ్రీపీఠం.. భక్తజనసంద్రం
Published Mon, Nov 20 2023 2:42 AM
1/2
2/2
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement