పెంటపాడు: పాడి పశువులను లాభసాటిగా పెంచేందుకు రైతులు అవగాహన పెంచుకోవాలని జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వహణాధికారి డాక్టర్ జేసురత్నం అన్నారు. రావిపాడులో మంగళవారం లేగదూడల ప్రదర్శన, అందాల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దూడల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చే వ్యాధులు, పాడిగేదెలకు మేత అంశాలను పశుసంవర్ధక శాఖ డీడీ నరసింహరావు తెలిపారు. సర్పంచ్ల చాంబర్ అధ్యక్షులు పెన్నాడ సూరిబాబు, సొసైటీ అధ్యక్షులు దేవ వెంకటరమణ, ఎంపీటీసీ సభ్యులు తాతారావు, ఉప సర్పంచ్ బుల్లబ్బాయి, కోరిమిల్లి పశువైద్యులు డాక్టర్ క్రాంతి పాల్గొన్నారు. పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను నిర్వాహకులు అందించారు.
Breadcrumb
- HOME
లేగదూడల సంరక్షణపై అవగాహన పెంచుకోవాలి
Published Wed, Mar 22 2023 2:26 AM
Related news
-
పదిలో బాలికలదే హవా
ఏలూరు (ఆర్ఆర్పేట): పదో తరగతి పరీక్షా ఫలితాల్లో బాలికలు సత్తాచారు. జిల్లాలోని ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన ఆకుల వెంకట సాయి మనస్వి రాష్ట్రస్థాయిలో 600 మార్కులకు 599 సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. 23,163 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 80.08 శాతంతో 18,549 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు 11,941 మందికి 10,036 మంది, బాలురు 11,222 మందికి 8,513 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా 13,851 మంది ప్రథమ శ్రేణిలో, 3,116 మంది ద్వితీయ శ్రేణిలో, 1,582 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. అయితే జిల్లా మాత్రం రాష్ట్రస్థాయిలో 25వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది. గతేడాది 64.35 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం పెరగడం విశేషం. 71 పాఠశాలల్లో నూరుశాతం జిల్లాలోని 71 పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణులు కాగా వీటిలో ప్రభుత్వ రంగ పాఠశాలలు పది ఉన్నాయి. నాగిరెడ్డిగూడెం ఏపీఆర్సీహెచ్ స్కూల్, ముసునూరు ఏపీ ఆర్ఈహెచ్ స్కూల్, అప్పలరాజుగూడెం ఏపీ ఆర్ఎస్ బాలుర స్కూల్, వేలేరుపాడు కేజీబీవీ, లంకపల్లి జీటీడబ్ల్యూహెచ్ స్కూల్, వీరమ్మకుంట జెడ్పీ హైస్కూల్ స్కూల్, కుక్కునూరు కేజీబీవీ, కేతవరం జెడ్పీ హైస్కూల్ స్కూల్, వేదాంతపురం జెడ్పీ హైస్కూల్, చింతలపూడి ఏపీఎస్డబ్ల్యూఆర్ బాలుర పాఠశాల ఉన్నాయి. మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ : పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు వచ్చేనెల 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు డీఈఓ ఎస్.అబ్రహం తెలిపారు. ఈనెల 23 నుంచి 30 వరకు అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. అలాగే రూ.50 అపరాధ రుసుంతో మే 1 నుంచి 23 వరకూ ఫీజు చెల్లించవచ్చన్నారు. కాగా రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు లు చేసుకోవాలనుకునే విద్యార్థులు హెచ్ఎంలను సంప్రదించాలని సూచించారు. రీ కౌంటింగ్కు సబ్జెక్టుకు రూ. 500, రీ వెరిఫికేషన్కు సబ్జెక్టుకు రూ.1,000 చొప్పున ఫీజును ఆన్లైన్లో చెల్లించాలన్నారు. బీసీ గురుకులాల్లో విఘ్నేష్ నరసాపురం రూరల్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లోని బీసీ గురుకుల పాఠశాలల్లో పదో తరగతి ఫలితాల్లో నరసాపురం మహాత్మా జ్యోతిబా పూలే మత్స్యకార బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి బి.విఘ్నేష్ 581 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచినట్టు ప్రిన్సిపాల్ గోటేటి వేణుగోపాలకృష్ణ తెలి పారు. జిల్లాలో 8 బీసీ గురుకుల పాఠశాలలు ఉన్నాయన్నారు. తమ పాఠశాలలో 36 మందికి 34 మంది ప్రథమ శ్రేణిలో, ఒకరు ద్వితీయ, ఒకరు తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారన్నారు. 10 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించారన్నారు. సర్కారీ బడి.. ఫలితాల్లో సవ్వడి జిల్లాలోని ప్రభుత్వ రంగ పాఠశాలల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ఆకట్టుకున్నారు. ● శనివారపుపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థి మురాల మహేష్బాబు 588 మార్కులు, ● గూటాల జెడ్పీ హైస్కూల్ విద్యార్థి గర్రే సాయి తన్మయి 587, ● కై కరం జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని శానం నందిని ప్రియ 587, ● చిన్నంపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థి జె.యశ్వంత్ 586, ● పూళ్ల జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని పులి లక్ష్మీ గాయత్రి 585, ● అప్పలరాజుగూడెం ఏపీఆర్ఎస్ బాలుర పాఠశాల విద్యార్థి తిరిమిల్లి జగన్నాథం 584, ● నాగిరెడ్డిగూడెం ఏపీఆర్జీహెచ్ స్కూల్ విద్యార్థినులు ఎం.అనురాధ లక్ష్మీ ఐశ్వర్య 584, కస్సే హనీ 584, ● నూజివీడు ఏపీఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి బెజవాడ ప్రేమ చంద్రిక 584, ● వడలి జెడ్పీ హైస్కూల్ విద్యార్థి పామిరెడ్డి దీక్షిత 583, ● నూజివీడు జెడ్పీ బాలికల హైస్కూల్ విద్యార్థి బత్తుల భువనేశ్వరి 583, ● షేక్ షబానా మెహరాజ్ 583, ● గణపవరం సీహెచ్ఎస్జెడ్పీ పీజీ హైస్కూల్ విద్యార్థి నాభిగారి మేఘన 583 మార్కులు సాధించారు. రాష్ట్రంలో ప్రథమ స్థానంలో జిల్లా విద్యార్థిని టెన్త్ ఫలితాల్లో సత్తాచాటినప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 80.08 శాతం ఉత్తీర్ణత మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు -
నగదు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి
ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకురాలు నీనా నిగమ్ ఏలూరు(మెట్రో): బ్యాంకుల్లో అధిక మొత్తంలో జరిగే నగదు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగమ్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ఎన్నికల విభాగాల నోడల్ అధికారులు, వ్యయ పరిశీలకులతో ఆమె సమీక్షించారు. పోస్టల్ ఆర్డర్లు, యూపీఐ పేమెంట్లపై దృష్టి సారించాలన్నారు. మద్యం రవాణా సమయంలో సక్రమమైన సమయంలో చేరాల్సిన చోటుకు చేరిందా లేదా అన్నది పరిశీలించాలన్నారు. జిల్లాలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డిపాజిట్లు, నగదు ఉపసంహరణలపై నిఘా పెట్టాలన్నారు. సోషల్ మీడియాలో అభ్యర్థుల అంశాలపై కూడా దృష్టి సారించాలన్నారు. కలెక్టర్ వె.ప్రసన్నవ వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు రూ.13.54 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం సీజ్ చేశామన్నారు. సీ–విజిల్కు సంబంధించి 329 ఫిర్యాదులు పరిష్కరించామన్నారు. 415 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఎన్నికల అజ్జర్వర్లను నియమించి తొలిదశ శిక్షణ పూ ర్తిచేశామని చెప్పారు. జిల్లా ఎస్పీ డి.మేరీ ప్ర శాంతి మాట్లాడుతూ జిల్లాలో అంతర రాష్ట్ర, జిల్లాల సరిహద్దుల వద్ద 8 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. పెట్రోలింగ్ బృందాలు, మొబైల్ చెక్పోస్టులను నిర్వహి స్తు న్నామని చెప్పారు. డీఆర్వో డి.పుష్పమణి, అ దనపు ఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు, జెడ్పీ సీ ఈఓ కె.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
హోమ్ ఓటింగ్కు చివరి అవకాశం
ఏలూరు(మెట్రో): పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వినియోగించుకోలేనివారు హోమ్ ఓటింగ్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అన్నారు. 85 ఏళ్ల వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, నడవలేని పరిస్థితిలో ఉన్నవారు ఇంటి వద్ద నుంచి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. ఈ మేరకు అర్హుల ఇంటి వద్దకే వెళ్లి బీఎల్ఓలు ఫారం–12(డి) అందిస్తున్నారన్నారు. దరఖాస్తును పూరించి ఈనెల 23లోపు సెక్టోరల్ అధికారులకు అందించాలన్నారు. వీటిని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పరిశీలించి వచ్చేనెల 2 నుంచి 5వ తేదీలోపు ఇంటి వద్ద ఓటు వేసే అవకాశం కల్పిస్తారన్నారు. -
గిరిజన సూపర్ బజార్ ప్రారంభం
బుట్టాయగూడెం: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా సహజ సిద్ధమైన అటవీ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని జీసీసీ డీఎం జి.పార్వతీశం చెప్పారు. మండల కేంద్రమైన బుట్టాయగూడెంలో గిరిజన సూపర్ బజార్ కాఫీ హౌస్ను పార్వతీశం సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీసీసీ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉందన్నారు. జీసీసీ ద్వారా విక్రయిస్తున్న తేనెకు ఎంతో డిమాండ్ ఉందన్నారు. అదేవిధంగా జీసీసీ సూపర్ బజార్లో ముఖ్యంగా జీసీసీ ద్వారా విక్రయిస్తున్న మరొక ఉత్పత్తి అరకు కాఫీకి కూడా అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో పేరుందని అన్నారు. అరకు కాఫీని పశ్చిమ మన్యం ప్రాంతంలో కూడా అందరికీ అందుబాటులో ఉంచే విధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగానే బుట్టాయగూడెంలో ప్రత్యేకంగా అరకు కాఫీ షాప్ను ఏర్పాటు చేశామని అన్నారు. ఇక్కడ కాఫీ తయారు చేసి విక్రయించడమే కాకుండా కాఫీపొడి ప్యాకెట్లను కూడా విక్రయిస్తామని చెప్పారు. అలాగే కుంకుడుకాయ ప్యాకెట్లు, షాంపూలు, బొబ్బర్లు, అలోవెరా సబ్బులు, త్రిఫల, తదితర వస్తువులను విక్రయిస్తున్నామని అన్నారు. నాణ్యమైన వస్తువులను తక్కువ ధరలకే విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అకౌంటెంట్ సీహెచ్ రాజయోగి, తదితరులు పాల్గొన్నారు. -
అత్యాచారయత్నం కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు
ఏలూరు (టూటౌన్)/కామవరపుకోట: అత్యాచారయత్నం కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ ఏలూరు ఐదో అదనపు జిల్లా జడ్జి, మహిళా కోర్టు న్యాయమూర్తి జి.రాజేశ్వరి సోమవారం తీర్పు వెలువరించారు. ఈ కేసుకు సంబంధించి ఏపీపీ డీవీ రామాంజనేయులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కామవరపుకోట మండలం వీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన నిందితుడు నిజవరపు సత్యనారాయణ అలియాస్ సత్తియ్య 2015 డిసెంబర్ 17న సాయంత్రం 4 గంటల సమయంలో ఆ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మేకలు మేపుకోవటానికి వెళ్ళిన ఓ మహిళపై వెనుక వైపు దాడి చేసి, పట్టుకుని అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో బాధితురాలు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న బాధితురాలి తండ్రి, మరికొందరు స్థానికులు రావడంతో నిందితుడు ఆమెను వదిలేసి పరారయ్యాడు. దీనిపై బాధితులు గ్రామంలోని పెద్దలకు మొరపెట్టుకున్నారు. నిందితుడు పెద్దల వద్దకు రాకపోవడంతో బాధితురాలు తడికలపూడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై అప్పటి ఎస్సై జీజే విష్ణువర్దన్ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ చేసి నిందితుడు నిజవరపు సత్యనారాయణను అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జీషీట్ ఫైల్ చేశారు. కేసు విచారణలో ఏపీపీ డీవీ రామాంజనేయులు వాదనలు వినిపించారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో జడ్జి జి.రాజేశ్వరి నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించారు. తడికలపూడి ఎస్సై ఎం.జైబాబు, కోర్టు కానిస్టేబుల్ కొండలరావు ప్రాసిక్యూషన్కు సహకరించారు. ‘పది’లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు ఏలూరు (ఆర్ఆర్పేట) : పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఏలూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు నమోదు చేయడం అభినందనీయమని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సైతం 100 శాతం ఉత్తీర్ణత సాధించడం, అత్యధిక మంది విద్యార్థులు అధిక శాతం మార్కులతో ఉత్తీర్ణులు కావడం వంటి ఫలితాలు విద్యాశాఖ పనితీరును సూచిస్తోందన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, కేజీబీవీ, ట్రైబల్ వెల్ఫేర్, మోడల్ స్కూల్స్ ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు వీరందరికీ దిశానిర్దేశనం చేసిన జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అబ్రహం, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ ఎల్.శ్రీకాంత్, 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా విజయ కేతనం పుస్తకాలు అందించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఆ పుస్తకాన్ని రూపొందించిన జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి అంగుటూరి సర్వేశ్వర రావులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగులకు ఓటు వేసే అవకాశం కల్పించాలని వినతి ఏలూరు (మెట్రో): ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను రాష్ట్ర వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు కోరారు. సోమవారం ఈ మేరకు ఈ–మెయిల్ ద్వారా ఎన్నికల అధికారికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ మే 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు నియోజకవర్గస్థాయిలో పోస్టల్ బ్యాలెట్తో సంబంధం లేకుండా ఓటు హక్కు వినియోగించుటకు అవకాశం కల్పించాలని కోరారు.
Related News by category
-
పదిలో బాలికలదే హవా
ఏలూరు (ఆర్ఆర్పేట): పదో తరగతి పరీక్షా ఫలితాల్లో బాలికలు సత్తాచారు. జిల్లాలోని ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన ఆకుల వెంకట సాయి మనస్వి రాష్ట్రస్థాయిలో 600 మార్కులకు 599 సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. 23,163 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 80.08 శాతంతో 18,549 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు 11,941 మందికి 10,036 మంది, బాలురు 11,222 మందికి 8,513 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా 13,851 మంది ప్రథమ శ్రేణిలో, 3,116 మంది ద్వితీయ శ్రేణిలో, 1,582 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. అయితే జిల్లా మాత్రం రాష్ట్రస్థాయిలో 25వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది. గతేడాది 64.35 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం పెరగడం విశేషం. 71 పాఠశాలల్లో నూరుశాతం జిల్లాలోని 71 పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణులు కాగా వీటిలో ప్రభుత్వ రంగ పాఠశాలలు పది ఉన్నాయి. నాగిరెడ్డిగూడెం ఏపీఆర్సీహెచ్ స్కూల్, ముసునూరు ఏపీ ఆర్ఈహెచ్ స్కూల్, అప్పలరాజుగూడెం ఏపీ ఆర్ఎస్ బాలుర స్కూల్, వేలేరుపాడు కేజీబీవీ, లంకపల్లి జీటీడబ్ల్యూహెచ్ స్కూల్, వీరమ్మకుంట జెడ్పీ హైస్కూల్ స్కూల్, కుక్కునూరు కేజీబీవీ, కేతవరం జెడ్పీ హైస్కూల్ స్కూల్, వేదాంతపురం జెడ్పీ హైస్కూల్, చింతలపూడి ఏపీఎస్డబ్ల్యూఆర్ బాలుర పాఠశాల ఉన్నాయి. మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ : పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు వచ్చేనెల 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు డీఈఓ ఎస్.అబ్రహం తెలిపారు. ఈనెల 23 నుంచి 30 వరకు అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చన్నారు. అలాగే రూ.50 అపరాధ రుసుంతో మే 1 నుంచి 23 వరకూ ఫీజు చెల్లించవచ్చన్నారు. కాగా రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు లు చేసుకోవాలనుకునే విద్యార్థులు హెచ్ఎంలను సంప్రదించాలని సూచించారు. రీ కౌంటింగ్కు సబ్జెక్టుకు రూ. 500, రీ వెరిఫికేషన్కు సబ్జెక్టుకు రూ.1,000 చొప్పున ఫీజును ఆన్లైన్లో చెల్లించాలన్నారు. బీసీ గురుకులాల్లో విఘ్నేష్ నరసాపురం రూరల్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లోని బీసీ గురుకుల పాఠశాలల్లో పదో తరగతి ఫలితాల్లో నరసాపురం మహాత్మా జ్యోతిబా పూలే మత్స్యకార బాలుర గురుకుల పాఠశాల విద్యార్థి బి.విఘ్నేష్ 581 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచినట్టు ప్రిన్సిపాల్ గోటేటి వేణుగోపాలకృష్ణ తెలి పారు. జిల్లాలో 8 బీసీ గురుకుల పాఠశాలలు ఉన్నాయన్నారు. తమ పాఠశాలలో 36 మందికి 34 మంది ప్రథమ శ్రేణిలో, ఒకరు ద్వితీయ, ఒకరు తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారన్నారు. 10 మంది విద్యార్థులు 500 మార్కులకు పైగా సాధించారన్నారు. సర్కారీ బడి.. ఫలితాల్లో సవ్వడి జిల్లాలోని ప్రభుత్వ రంగ పాఠశాలల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ఆకట్టుకున్నారు. ● శనివారపుపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థి మురాల మహేష్బాబు 588 మార్కులు, ● గూటాల జెడ్పీ హైస్కూల్ విద్యార్థి గర్రే సాయి తన్మయి 587, ● కై కరం జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని శానం నందిని ప్రియ 587, ● చిన్నంపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థి జె.యశ్వంత్ 586, ● పూళ్ల జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని పులి లక్ష్మీ గాయత్రి 585, ● అప్పలరాజుగూడెం ఏపీఆర్ఎస్ బాలుర పాఠశాల విద్యార్థి తిరిమిల్లి జగన్నాథం 584, ● నాగిరెడ్డిగూడెం ఏపీఆర్జీహెచ్ స్కూల్ విద్యార్థినులు ఎం.అనురాధ లక్ష్మీ ఐశ్వర్య 584, కస్సే హనీ 584, ● నూజివీడు ఏపీఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి బెజవాడ ప్రేమ చంద్రిక 584, ● వడలి జెడ్పీ హైస్కూల్ విద్యార్థి పామిరెడ్డి దీక్షిత 583, ● నూజివీడు జెడ్పీ బాలికల హైస్కూల్ విద్యార్థి బత్తుల భువనేశ్వరి 583, ● షేక్ షబానా మెహరాజ్ 583, ● గణపవరం సీహెచ్ఎస్జెడ్పీ పీజీ హైస్కూల్ విద్యార్థి నాభిగారి మేఘన 583 మార్కులు సాధించారు. రాష్ట్రంలో ప్రథమ స్థానంలో జిల్లా విద్యార్థిని టెన్త్ ఫలితాల్లో సత్తాచాటినప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 80.08 శాతం ఉత్తీర్ణత మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు -
నగదు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి
ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకురాలు నీనా నిగమ్ ఏలూరు(మెట్రో): బ్యాంకుల్లో అధిక మొత్తంలో జరిగే నగదు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగమ్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ఎన్నికల విభాగాల నోడల్ అధికారులు, వ్యయ పరిశీలకులతో ఆమె సమీక్షించారు. పోస్టల్ ఆర్డర్లు, యూపీఐ పేమెంట్లపై దృష్టి సారించాలన్నారు. మద్యం రవాణా సమయంలో సక్రమమైన సమయంలో చేరాల్సిన చోటుకు చేరిందా లేదా అన్నది పరిశీలించాలన్నారు. జిల్లాలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డిపాజిట్లు, నగదు ఉపసంహరణలపై నిఘా పెట్టాలన్నారు. సోషల్ మీడియాలో అభ్యర్థుల అంశాలపై కూడా దృష్టి సారించాలన్నారు. కలెక్టర్ వె.ప్రసన్నవ వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు రూ.13.54 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం సీజ్ చేశామన్నారు. సీ–విజిల్కు సంబంధించి 329 ఫిర్యాదులు పరిష్కరించామన్నారు. 415 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఎన్నికల అజ్జర్వర్లను నియమించి తొలిదశ శిక్షణ పూ ర్తిచేశామని చెప్పారు. జిల్లా ఎస్పీ డి.మేరీ ప్ర శాంతి మాట్లాడుతూ జిల్లాలో అంతర రాష్ట్ర, జిల్లాల సరిహద్దుల వద్ద 8 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. పెట్రోలింగ్ బృందాలు, మొబైల్ చెక్పోస్టులను నిర్వహి స్తు న్నామని చెప్పారు. డీఆర్వో డి.పుష్పమణి, అ దనపు ఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు, జెడ్పీ సీ ఈఓ కె.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
హోమ్ ఓటింగ్కు చివరి అవకాశం
ఏలూరు(మెట్రో): పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వినియోగించుకోలేనివారు హోమ్ ఓటింగ్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అన్నారు. 85 ఏళ్ల వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, నడవలేని పరిస్థితిలో ఉన్నవారు ఇంటి వద్ద నుంచి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. ఈ మేరకు అర్హుల ఇంటి వద్దకే వెళ్లి బీఎల్ఓలు ఫారం–12(డి) అందిస్తున్నారన్నారు. దరఖాస్తును పూరించి ఈనెల 23లోపు సెక్టోరల్ అధికారులకు అందించాలన్నారు. వీటిని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పరిశీలించి వచ్చేనెల 2 నుంచి 5వ తేదీలోపు ఇంటి వద్ద ఓటు వేసే అవకాశం కల్పిస్తారన్నారు. -
వైఎస్సార్ సీపీలోకి కోరుకొల్లు జనసేన నేతలు
కలిదిండి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి రాష్ట్రంలో అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జనసేన నాయకులు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. కోరుకొల్లు గ్రామం నుంచి మాజీ సర్పంచ్ చన్నంశెట్టి సుబ్రహ్మణ్యం, జనసేన నాయకులు చన్నంశెట్టి భాస్కర్, పూసల పుల్లయ్య, పూసల బాలులు ఎంపీపీ చందన ఉమామహేశ్వరరావు, ఉపసర్పంచ్ చన్నంశెట్టి నాగరాజు, పీఏసీఎస్ అధ్యక్షులు అంకెం నరసయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డీఎన్నార్ సమక్షంలో పార్టీలో చేరారు. జిల్లా ఎస్సీ నాయకులు దాసి యేసుబాబు, కాన్వెంట్ కృష్ణ, చన్నంశెట్టి వెంకటరాజు, వలవల చిన్న పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా గోపాల్ యాదవ్ నియామకం చింతలపూడి : వైఎస్సార్ సీపీ బీసీ నాయకులు గోరుముచ్చు గోపాల్ యాదవ్కు పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో కీలక పదవి లభించింది. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గోపాల్ యాదవ్ను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. చింతలపూడి నియోజకవర్గం, కామవరపుకోట మండలం, గుంటుపల్లి పంచాయితీ కంఠమనేనివారిగూడెం గ్రామానికి చెందిన గోపాల్ యాదవ్ సింగపూర్, మలేషియాలలో పలు సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఎంతో మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆయన టీడీపీ నుంచి ఏలూరు పార్లమెంట్ సీటు ఆశించి భంగపడ్డారు. అనంతరం టీడీపీ నుండి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. టీడీపీలో బీసీలకు న్యాయం జరగదని, బీసీలకు వైఎస్సార్ సీపీ మాత్రమే న్యాయం చేయగలదని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. పార్టీలో చేరిన నాటి నుంచి జిల్లాలోని బీసీలను సమాయత్త పరిచి వైఎస్సార్ సీపీలో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. బీసీలకు వైఎస్సార్ సీపీలో సముచిత స్ధానం ఉందని, బీసీలు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలంటే సీఎం వైఎస్ జగన్కు మద్దతు ఇవ్వాలని ప్రచారం చేస్తున్నారు. ఏలూరు ఎంపీ కారుమూరి సునీల్ యాదవ్తో పాటు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో బీసీల ఓట్లు వైఎస్సార్ సీపీ అభ్యర్థులకే వేసి గెలిపించాలని విస్త్రృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రూ.272 పలికిన వర్జీనియా కేజీ ధర జంగారెడ్డిగూడెం : వర్జీనియా పొగాకు ధర కేజీ ఒక్కింటికి రూ.272కు చేరుకుంది. ఈ ఏడాది మార్చి 6న వేలం ప్రారంభం కాగా, ప్రారంభ ధర కేజీకి రూ.240 లభించింది. అయితే ఇది క్రమంగా ఈ నెల 20వ తేదీ నాటికి రూ.266కు చేరుకుంది. కాగా, సోమవారం ఈ సీజన్లో అత్యధికంగా రూ.272 ధర పలికింది. అయితే ఇది ఇంకా పెరుగుతుందని రైతులు చెబుతున్నారు. ఇంకా ప్రధాన కంపెనీలు వేలంలో చురుగ్గా పాల్గొనడం లేదు. దీంతో చిన్న చిన్న కంపెనీలు, సప్లయిర్స్ వేలంలో పాల్గొంటున్నారు. గత ఏడాది వేలంలో కేజీ ధర అత్యధికంగా రూ.288 లభించింది. ఈ ఏడాది ఈ గరిష్ట ధర దాటి లభించే అవకాశం ఉందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. ఇదిలా ఉంటే జంగారెడ్డిగూడెం–1, –2 వేలం కేంద్రాల్లో సోమవారం కేజీ ధర రూ.272 లభించింది. కొయ్యలగూడెం, గోపాలపురం కేంద్రాల్లో రూ.271, దేవరపల్లి వేలం కేంద్రంలో రూ.268 చొప్పున విక్రయాలు జరిగాయి. తనిఖీల్లో రూ.2 లక్షల నగదు స్వాధీనం కామవరపుకోట: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కామవరపుకోట ఎన్నికల చెక్పోస్ట్ వద్ద సోమవారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఒక వ్యక్తి నుంచి ఎటువంటి ఆధారాలు లేని రూ.1.59 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెక్పోస్ట్ ఎన్నికల అధికారి మహమ్మద్ మోహిద్దీన్ చెప్పారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామానికి చెందిన ఆటోలో వెళుతున్న వ్యక్తి నుంచి ఈ నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నగదున సీజ్ చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ ఏఎస్సై స్వామి ద్వారా ఏలూరు ట్రెజరీలో జమ చేస్తామన్నారు. తనిఖీల్లో పోలీసు సిబ్బంది కె.రామకృష్ణ, సూర్యనాయక్, ఎ.సుధీర్, ఎం.నాగార్జున పాల్గొన్నారు. గణపవరంలో.. గణపవరం: గణపవరంలో సోమవారం ఎఫ్ఎస్టీ తనిఖీ బృందం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో ఎన్నికల నిబంధనలకు మించి సొమ్ము కలిగి ఉన్న వ్యక్తి నుంచి రూ.1.06,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నిబంధనల మేరకు రూ.50 వేలకు మించి నగదును వెంట తీసుకువెళితే స్వాధీనం చేసుకుంటామని అధికారులు తెలిపారు. -
అత్యాచారయత్నం కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు
ఏలూరు (టూటౌన్)/కామవరపుకోట: అత్యాచారయత్నం కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ ఏలూరు ఐదో అదనపు జిల్లా జడ్జి, మహిళా కోర్టు న్యాయమూర్తి జి.రాజేశ్వరి సోమవారం తీర్పు వెలువరించారు. ఈ కేసుకు సంబంధించి ఏపీపీ డీవీ రామాంజనేయులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కామవరపుకోట మండలం వీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన నిందితుడు నిజవరపు సత్యనారాయణ అలియాస్ సత్తియ్య 2015 డిసెంబర్ 17న సాయంత్రం 4 గంటల సమయంలో ఆ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మేకలు మేపుకోవటానికి వెళ్ళిన ఓ మహిళపై వెనుక వైపు దాడి చేసి, పట్టుకుని అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో బాధితురాలు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న బాధితురాలి తండ్రి, మరికొందరు స్థానికులు రావడంతో నిందితుడు ఆమెను వదిలేసి పరారయ్యాడు. దీనిపై బాధితులు గ్రామంలోని పెద్దలకు మొరపెట్టుకున్నారు. నిందితుడు పెద్దల వద్దకు రాకపోవడంతో బాధితురాలు తడికలపూడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై అప్పటి ఎస్సై జీజే విష్ణువర్దన్ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ చేసి నిందితుడు నిజవరపు సత్యనారాయణను అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జీషీట్ ఫైల్ చేశారు. కేసు విచారణలో ఏపీపీ డీవీ రామాంజనేయులు వాదనలు వినిపించారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో జడ్జి జి.రాజేశ్వరి నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించారు. తడికలపూడి ఎస్సై ఎం.జైబాబు, కోర్టు కానిస్టేబుల్ కొండలరావు ప్రాసిక్యూషన్కు సహకరించారు. ‘పది’లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు ఏలూరు (ఆర్ఆర్పేట) : పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఏలూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు నమోదు చేయడం అభినందనీయమని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సైతం 100 శాతం ఉత్తీర్ణత సాధించడం, అత్యధిక మంది విద్యార్థులు అధిక శాతం మార్కులతో ఉత్తీర్ణులు కావడం వంటి ఫలితాలు విద్యాశాఖ పనితీరును సూచిస్తోందన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, కేజీబీవీ, ట్రైబల్ వెల్ఫేర్, మోడల్ స్కూల్స్ ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు వీరందరికీ దిశానిర్దేశనం చేసిన జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అబ్రహం, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ ఎల్.శ్రీకాంత్, 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా విజయ కేతనం పుస్తకాలు అందించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఆ పుస్తకాన్ని రూపొందించిన జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు కార్యదర్శి అంగుటూరి సర్వేశ్వర రావులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగులకు ఓటు వేసే అవకాశం కల్పించాలని వినతి ఏలూరు (మెట్రో): ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను రాష్ట్ర వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు కోరారు. సోమవారం ఈ మేరకు ఈ–మెయిల్ ద్వారా ఎన్నికల అధికారికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ మే 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు నియోజకవర్గస్థాయిలో పోస్టల్ బ్యాలెట్తో సంబంధం లేకుండా ఓటు హక్కు వినియోగించుటకు అవకాశం కల్పించాలని కోరారు.
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
'రింకూ ఒక అద్బుతం.. కానీ అతడిని సెలక్ట్ చేయలేకపోయాం'
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్
T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
దగాకోరు చంద్రబాబుతో తస్మాత్ జాగ్రత్త: పేర్ని నాని
ఓటర్ల అవగాహన కోసం కాలేజీ విద్యార్థులు వినూత్న ప్రదర్శన (ఫోటోలు)
మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
దుబాయ్లో మళ్లీ దంచికొడుతున్న వాన.. పలు విమానాలు రద్దు
బ్రిజ్భూషణ్కు హ్యాండ్ ఇచ్చిన బీజేపీ.. సిట్టింగ్ ఎంపీకి నో ఛాన్స్
చంద్రబాబు పగ.. ఫస్టొచ్చింది.. పెన్షన్ రాలేదు
చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న
Photos
View allVideo
View allతప్పక చదవండి
- అనంత హైవేపై కంటెయినర్ల నిండా డబ్బు
- Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్గా గృహప్రవేశం (ఫోటోలు)
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- సీరియల్ నటి సీమంతం.. ఫోటోలు వైరల్
- చంద్రబాబు మేనిఫెస్టో అబద్దాల పుట్ట: సజ్జల
- సురేశ్ రైనా ఇంట మరో విషాదం.. రోడ్డు ప్రమాదంలో సమీప బంధువు మృతి
- నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్లో వారిద్దరే ఉన్నారు.. ఎన్టీఆర్ లేడు: రాజమౌళి
- ధోని తీరుపై విమర్శలు.. ఊహించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు
Advertisement