వాండ్రంలో ప్రశాంత పరిస్థితులు | Sakshi
Sakshi News home page

వాండ్రంలో ప్రశాంత పరిస్థితులు

Published Mon, Aug 21 2023 12:52 AM

వాండ్రంలో దర్యాప్తు చేస్తున్న డీఎస్పీ శ్రీనాథ్‌ - Sakshi

ఉండి: గత కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన వాండ్రంలో ఆదివారం ప్రశాంత వాతావరణం నెలకొంది. డీఎస్పీ కే శ్రీనాథ్‌ ఆదివారం వాండ్రంలో పర్యటించారు. స్థానికంగా ఉన్న ఎస్సీ నాయకులు, యువకులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇరువర్గాలు ఎవరి పనులు వారు చేసుకుంటూ ప్రశాంతంగా జీవించాలని, గత సంఘటనలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఇరువర్గాలకు తెలిపారు. ఇతరుల మాటలు విని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని.. అలా చేస్తే కఠిన శిక్షలు తప్పవని డీఎస్పీ తెలిపారు. గ్రామంలో కొద్దిరోజులు పోలీస్‌ పికెటింగ్‌ ఉంటుందని తెలిపారు. వాండ్రంలో లూథరన్‌ చర్చ్‌పై దాడి ఘటనలో చర్చ్‌ సంఘ పెద్దలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 18న రాత్రి వాండ్రం లూథరన్‌ చర్చ్‌పై గ్రామ సర్పంచ్‌ దాసరి కృష్ణ ప్రోద్బలంతో కొందరు కర్రలతో దాడి చేసి కులం పేరుతో దూషిస్తూ భయభ్రాంతులకు గురి చేసినట్లు సంఘ పెద్దలు కోనాల రాజేంద్రకుమార్‌ తదితరుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కే గంగాధరరావు తెలిపారు. కేసును డీఎస్పీ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement