మాకు మళ్లీ జగనే సీఎంగా కావాలి. సంక్షేమ, అభివృద్ధి పాలనతో రాష్ట్రాన్ని స్వర్ణయుగంగా మార్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఉమ్మడి పశ్చిమ జిల్లాలోని ప్రజలు ముక్తకంఠంతో నినదించారు. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమం ప్రారంభం రోజున వాడవాడలా పార్టీ జెండాలు ఎగురవేసి వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధ పథకాలతో కూడిన బోర్డులను ప్రదర్శించారు. మరోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవసరాన్ని ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించారు.