భారీగా మద్యం స్వాధీనం | Sakshi
Sakshi News home page

భారీగా మద్యం స్వాధీనం

Published Sun, Nov 12 2023 1:52 AM

వివరాలను వెల్లడిస్తున్న ఎస్‌ఈబీ ఏఎస్పీ ఎన్‌.సూర్యచంద్రరావు  - Sakshi

నూజివీడు: ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ సరిహద్దు చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం చెక్‌పోస్టు వద్ద తెలంగాణ రాష్ట్రం నుంచి జిల్లాలోకి అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ ఎన్‌.సూర్యచంద్రరావు శనివారం చెప్పారు. తమకు అందిన సమాచారం మేరకు ఎస్‌ఈబీ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణ ధనరాజ్‌, నూజివీడు ఇన్స్‌పెక్టర్‌ టీ గోపాలకృష్ణ, ఎస్‌ఐ అల్లూరయ్య, హెడ్‌ కానిస్టేబుల్‌ కేవీవీ సత్యన్నారాయణలు సిబ్బందితో కలిసి చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా నూజివీడుకు చెందిన పామర్తి గోపాలకృష్ణ అక్రమంగా తరలిస్తున్న 100 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణలో యానాంకు చెందిన 97 ఫుల్‌ బాటిల్స్‌, 706 క్వార్టర్‌ బాటిల్స్‌ మొత్తం 803 బాటిల్స్‌ వివరాలను తెలపగా వాటిని కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. మద్యం అక్రమ రవాణా చేస్తున్న అతనిపై నూజివీడు సెబ్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement
Advertisement