పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్య

Published Mon, Nov 20 2023 1:44 AM

- - Sakshi

తాడేపల్లిగూడెం రూరల్‌: కడుపు నొప్పి తాళలేక ఓ వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన తాడిపట్టి వీరమ్మ (40) కడుపు నొప్పి తాళలేక ఆదివారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా, దీంతో ఆమెను కుటుంబ సభ్యులు తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి తల్లి గండికోట నాగమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై రూరల్‌ ఏఎస్సై దుర్గారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement