క్షేత్రంలో గుండెపోటుతో కురుపాం ఎంపీడీవో మృతి | Sakshi
Sakshi News home page

క్షేత్రంలో గుండెపోటుతో కురుపాం ఎంపీడీవో మృతి

Published Mon, Nov 20 2023 1:44 AM

శివరామప్ప మృతదేహం  - Sakshi

ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో గుండెపోటుకు గురై విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రామానికి చెందిన, కురుపాం ఎంపీడీవో వంగూరి వెంకట శివరామప్ప (60) ఆదివారం మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలసి క్షేత్రానికి విచ్చేసిన ఆయన మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లను దర్శించారు. అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చిన ఆయన తూర్పు రాజగోపుర ప్రాంతంలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను దేవస్థానం ఆంబులెన్స్‌లో స్థానిక ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. రామప్పను పరీక్షించిన వైద్యుడు అప్పటికే ఆయన మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని అదే ఆంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలించారు.

Advertisement
Advertisement