గోవింద మాలధారణ స్వీకరణ | Sakshi
Sakshi News home page

గోవింద మాలధారణ స్వీకరణ

Published Sun, Dec 3 2023 1:36 AM

భక్తుడికి మాలధారణ చేస్తున్న అర్చకులు 
 - Sakshi

ద్వారకాతిరుమల: ఆధ్యాత్మిక చింతన కోసం పలువురు భక్తులు శనివారం శ్రీవారి అర్ధమండల దీక్షను స్వీకరించారు. ముందుగా వారు పసుపు వర్ణ దుస్తులతో ఆలయానికి చేరుకోగా, అర్చకులు వారికి మెడలో మాలలను వేశారు. దీక్షను స్వీకరించిన వారంతా స్వామివారి తొలిహార తిని తీసుకున్న అనంతరం శ్రీవారు, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత ఆలయ ముఖ మండపంలో గోవింద నామాలు చెబుతూ భజనలు చేశారు. అనంతరం ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలో ఉన్న దీపారాధన మండపంలో దీపాలను వెలిగించి భక్తి ప్రపత్తులను చాటారు. ఈనెల 23న ముక్కోటి ఏకాదశి పర్వదినం నాడు శ్రీవారి ఉత్తరద్వార దర్శనం చేసుకున్న తరువాత దీక్షాధారులు ఇరుముడులను సమర్పిస్తారు.

Advertisement
Advertisement