న్యాయవాదులకు అండగా ‘లా నేస్తం’ | Sakshi
Sakshi News home page

న్యాయవాదులకు అండగా ‘లా నేస్తం’

Published Tue, Dec 12 2023 1:04 AM

న్యాయవాదులకు చెక్కు అందిస్తున్న ఎమ్మెల్యే వాసుబాబు, కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌   - Sakshi

ఏలూరు(మెట్రో): యువ న్యాయవాదులకు అండగా ప్రభుత్వం వైఎస్సార్‌ లానేస్తం ద్వారా ఆర్థిక సాయం అందిస్తోందని కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. సోమవారం జూలై–డిసెంబర్‌ 2023కు సంబంధించి లా నేస్తం నిధుల విడుదల కార్యక్రమాన్ని వర్చువల్‌గా కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌తో పాటు ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ వెజ్జు వెంకటేశ్వరరావు వీక్షించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 82 మంది లబ్ధిదారులకు రూ.24.60 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు చెప్పారు. యువ న్యాయవాదులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, ప్రాక్టీస్‌ సమయంలో ప్రోత్సాహకంగా ఈ నగదు ఉపయోగపడుతుందన్నారు. లా కోర్సు పూర్తి చేసిన యువ న్యాయవాదికి మూడేళ్లపాటు ఏడాదికి రూ.60 వేల చొప్పున రూ.1.80 లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. లా నేస్తం తమకెంతో ఉపయోగపడుతుందని యువ న్యాయవాదులు తేజశ్వి, విజయ్‌ రోహితి, ప్రేమ్‌కుమార్‌ ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌ ఏఓ రమాదేవి పాల్గొన్నారు.

Advertisement
Advertisement