మనం సాంకేతికంగా ఎంత వేగంగా దూసుకుపోతున్నా, కొన్ని ప్రాంతాలలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే... అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఉత్తర్ప్రదేశ్లోని బులంద్షహర్కు చెందిన 70 సంవత్సరాల నూర్జహాన్ ఇంట్లో ఒక్కసారి కూడా బల్బ్ వెలగలేదు.
ఆ ఇంటికి ఎలక్ట్రిసిటీ లేదు. విషయం తెలిసిన ఐపీయస్ ఆఫీసర్ అనుకృతిశర్మ వ్యక్తిగత చొరవ తీసుకొని ఆ ఇంటికి కరెంట్ తీసుకు వచ్చింది. బామ్మ కళ్లలో వెలుగులు నింపింది.
ఆ ఇంట్లో బల్బ్ వెలగడమే కాదు ‘మీరు చల్లగా ఉండాలి’ అంటున్నట్లుగా ఫ్యాన్ తిరగడం మొదలుపెట్టింది. దీంతో బామ్మ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. అనుకృతిని ఆలింగనం చేసుకొని స్వీట్లు పంచింది. ‘ఆమె ముఖంలో కనిపించిన సంతోషం నాకెంతో సంతృప్తిని ఇచ్చింది’ అంటూ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది అనుకృతి. అనుకృతి శర్మ దయాహృదయానికి నెటిజనులు జేజేలు చెప్పారు. ‘బామ్మ ఇంట్లోనే కాదు జీవితంలోనూ వెలుగులు నిండాలి’ అంటూ కామెంట్స్ పెట్టారు.
Breadcrumb
- HOME
‘పవర్’ఫుల్ ఐపీయస్ ఆఫీసర్
Published Sun, Jul 2 2023 4:36 AM
Related news
-
ఏబీవీ.. ఎనీటైం బాబు వెంటే
సాక్షి, అమరావతి: ఆయనో సీనియర్ ఐపీఎస్ అధికారి. ‘ఎనీటైమ్ బాబు వెంటే’ (ఏబీవీ)గా పేరు తెచ్చుకున్న ఆయన ఐపీఎస్ అధికారిగా కంటే.. టీపీఎస్ (టీడీపీ పొలిటికల్ సర్విస్) అధికారిగా పనిచేయడానికే ఎక్కడలేని ఆసక్తి చూపుతారు. చంద్రబాబు సీఎంగా ఉండగా 2014–19 వరకు ఆయన అడ్డగోలుగా చెలరేగిపోయారు. ఇష్టారాజ్యంగా అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారు. బంధువులు, బినామీల పేరిట అమరావతిలో భూదోపిడీకీ తెగబడ్డారు.ప్రభుత్వ అధికారిక విధుల కంటే టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేశారు. ముఖ్యంగా.. 2014లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 23 మందిని ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేరి్పంచడంలో ఆయనదే కీలకపాత్ర. కేంద్ర భద్రతా చట్టాలను ఉల్లంఘించి మరీ డేటాచోరీకి పాల్పడటం జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. కొన్నేళ్లుగా సస్పెన్షన్లో ఉన్న ఆ అధికారి ప్రస్తుతం ఎన్నికల్లో మరోసారి టీడీపీ రాజకీయ లబ్ధికోసం సివిల్ సర్విస్ నిబంధనలకు విరుద్ధంగా బరితెగిస్తున్నారు. తెలుగుదేశం తరఫున రెబల్స్గా బరిలో ఉన్న వారిని బెదిరిస్తూ.. టీడీపీ ఏకపక్ష వైఖరితో విసిగిపోయి కినుక వహించిన జనసేన, బీజేపీ నేతల భరతంపడుతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా టీడీపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఆ అధికారి బరితెగింపు ఎలాగుందంటే.. టీడీపీ రెబల్స్కు బెదిరింపులు.. పార్టీ కోసం పనిచేసిన నేతలకు కాకుండా లోకేశ్కు ముడుపులు చెల్లించుకున్న బడా బాబులకే ఈ ఎన్నికల్లో చంద్రబాబు టికెట్లు కేటాయించడంతో ఆ పారీ్టలో అసమ్మతి భగ్గుమంది. దాంతో పలువురు టీడీపీ రెబల్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మరోవైపు.. బీజేపీ, జనసేన పారీ్టలకు టీడీపీ అరకొరగా సీట్లు కేటాయించడంపట్ల ఆ రెండు పారీ్టల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఆ రెండు పార్టీల అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా పోటీచేస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండిపోయారు. ఈ పరిణామాలు టీడీపీ విజయావకాశాలు దెబ్బతీయడం ఖాయమని స్పష్టమైంది. దీంతో బెంబేలెత్తిన చంద్రబాబు తన నమ్మినబంటు అయిన ఆ వివాదాస్పద ఐపీఎస్ అధికారిని రంగంలోకి దించారు. ఇంకేముంది.. ఆ అధికారి టీడీపీ రెబల్స్గా బరిలో ఉన్న నేతలే లక్ష్యంగా బెదిరింపుల పర్వానికి దిగారు. ఉదా.. ∗ నూజివీడులో టీడీపీ రెబల్ అభ్యరి్థగా నామినేషన్ వేసిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తాజాగా వెనక్కి తగ్గడం వెనుక ఆ అధికారి బెదిరింపులే కారణం. సదరు అధికారి కూడా నూజివీడు నియోజకవర్గానికే చెందిన వ్యక్తే. ఈయన ముద్దరబోయిన వెంకటేశ్వరరావుతో ఇటీవల రెండు మూడుసార్లు భేటీ అయ్యారు. నామినేషన్ ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ముద్దరబోయిన తన నామినేషన్ను వెనక్కి తీసుకోవడం గమనార్హం. ∗ అలాగే, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీచేసి తీరుతానని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ ప్రకటించారు. ఆ మేరకు ఆ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ర్యాలీలు కూడా నిర్వహించి చంద్రబాబు, అచ్చెన్నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో ఆయనకు టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు వచి్చంది. చంద్రబాబు పిలిపించారని భావించిన రమణకు విజయవాడ వచ్చాక ఝలక్ తగిలింది.టీడీపీ తరఫున ఆ ఐపీఎస్ అధికారే రమణతో మాట్లాడినట్లు సమాచారం. నిజానికి.. 2014లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కలమట వెంకట రమణను అప్పట్లో ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేరేలా వ్యవహారం నడిపింది ఈ అధికారే. అందుకే ఇప్పుడు కూడా ఆయనకే చంద్రబాబు బాధ్యత అప్పగించారు. రెబల్గా పోటీ చేయకూడదని, పోటీచేస్తే ఆయన ఆరి్థక మూలాలు దెబ్బతీస్తామని.. గతంలో ఎక్కడెక్కడ నల్లధనాన్ని పెట్టుబడిగా పెట్టిందీ ఆధారాలతో బయటకుతీస్తానని స్పష్టంచేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కలమట వెంకటరమణ పోటీచేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ∗ జగ్గయ్యపేట, గన్నవరం, జగ్గంపేట, ఎస్.కోట, విజయనగరం తదితర నియోజకవర్గాల్లో బరిలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన రెబల్ అభ్యర్థుల వద్దకూ తన అనుచరులను పంపించి బెదిరిస్తున్నట్లుగా తెలుస్తోంది. తన మనుషులను వారి వద్దకు పంపించి మరీ వారి్నంగులు ఇప్పిస్తున్నారని సమాచారం. ఆ అధికారి తీరుపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ∗ ఇక విజయవాడ పశి్చమ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి అనుకూలంగా ఆ అధికారి రంగంలోకి దిగారు. టీడీపీ అసంతృప్త నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ఖాన్ను తనదైన శైలిలో బెదిరించినట్లు సమాచారం. 2014లో వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన టీడీపీలో చేరడం వెనుక ఈ వివాదాస్పద అధికారే క్రియాశీలక పాత్ర పోషించారు. సుజనాచౌదరికి అనుకూలంగా ముస్లింలతో సమావేశం నిర్వహించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొందరు ముస్లింలతో ఓ సమావేశం నిర్వహించి సుజనాకు ఓటు వేయాలని చెప్పాల్సి వచి్చందని జలీల్ఖాన్ సన్నిహితులే చెబుతున్నారు. కానీ, సుజనాచౌదరికి ముస్లింలు ఓటు వేసేదేలేదని కూడా వారు స్పష్టంచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. టీడీపీ నుంచి వచి్చన సుజనాకు టికెట్ కేటాయించడం సంప్రదాయ బీజేపీవాదులకు తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. దీంతో ఆ నేతలు ప్రచారానికి దూరంగా ఉండిపోయారు. దీన్ని గుర్తించిన ఆ అధికారి అసంతృప్త బీజేపీ నేతలతో తన స్టైల్లో మాట్లాడారు. వన్టౌన్లో దశాబ్దాలుగా వారు నిర్వహిస్తున్న వ్యాపార సంస్థలను దెబ్బతీస్తామని హెచ్చరించారు. -
మాఫియాపై సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు.. ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా
గత ప్రభుత్వంలో నేరస్తులు సురక్షితంగా ఉండేవారు. కానీ పరిస్థితులు మారాయి. బీజేపీ ప్రభుత్వంలో నేరస్తులు లొంగిపోవాలని చూస్తున్నారు. లేదంటే వారి ప్రాణాల్ని తృణ ప్రాయంగా వదిలేసుకుంటున్నారని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బరేలీలో జరిగిన బహిరంగ ర్యాలీలో సీఎం యోగి మాట్లాడుతూ.. ఇది మన (బీజేపీ) ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వ రక్షణలో ఉన్న మాఫియా ఇప్పుడు లొంగిపోవాలని చూస్తుందని అన్నారు. సమాజ్ వాదీ పార్టీ మాఫియాలు, నేరగాళ్ల పట్ల సానుభూతి చూపుతోందని సీఎం యోగి ఆరోపించారు .జీవితం అంతా రాష్ట్ర సేవలో, అయోధ్య సేవలో గడిపిన కళ్యాణ్ సింగ్ మరణంపై సమాజ్ వాదీ పార్టీ సంతాపం తెలపకపోవడంపై సీఎం యోగి మండిపడ్డారు. కానీ, ఆయన మరణంతో సమాజ్వాదీ పార్టీ ప్రజలు మొసలి కన్నీరు కారుస్తుందని వ్యాఖ్యానించారు. అధికారంలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ రాముడు, అయోధ్య రామ మందిరంపై అవాకులు చెవాకులు పేల్చారు. ఇప్పడు ఆ పార్టీలు ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంటాయో.. అధికారం లేని ఆ పార్టీలు అలాగే గిలగిల కొట్టుకుంటున్నాయని ఎద్దేవా చేశారు.లోక్సభలో అత్యధికంగా 80 మంది ఎంపీలతో ప్రాతినిధ్యం వహించే ఉత్తరప్రదేశ్లో మొత్తం ఏడు దశల్లో ఓటింగ్ జరుగుతోంది. లోక్సభ ఎన్నికల మొదటి దశకు ఏప్రిల్ 19న ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహించగా, మరో ఎనిమిది నియోజకవర్గాలకు రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 26న ముగిసింది. ఆ తర్వాత మే 7, మే 13 ,మే 20, మే 23, జూన్ 1 తేదీల్లో ఐదు, ఆరు, ఏడు దశల్లో పోలింగ్ జరుగుతుంది. వరుసగా మొత్తం ఏడు దశల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. -
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
లక్నో: ఉత్తర ప్రదేశ్లో విచిత్ర ఘటన వెలుగుచూసింది. పరీక్షల్లో జవాబు పత్రాలపై పాటలు, జైశ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్ధులను ప్రొఫెసర్లు పాస్ చేశారు. రాష్ట్రంలోని వీర్ బహదూర్ సింగ్ పుర్వాంచల్ యూనివర్సిటీలో ఈ ఉదంతం వెలుగు చూసింది. యూనివర్సీటీలో ఇటీవల ఫార్మసీ పరీక్షలు జరిగాయి. ‘ఫార్మసీని కెరీర్గా ఎంచుకోవడం’పై ప్రశ్న రాగా.. పలువురు విర్యార్ధులు తమ జవాబు పత్రాల్లో జై శ్రీరామ్ అని రాశారు.అంతేగాక హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి క్రికెరట్ల పేర్లు కూడా రాశారు. విచిత్రమేంటంటే.. ఆ విద్యార్థులందరూ పాస్ అయ్యారు. అయితే పలువురు విద్యార్ధులు ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ బాగోతం బయటకు వచ్చింది. తమకు మంచి మార్కులు వేసి పాస్ చేసేందుకు పలువురు విద్యార్థులు ప్రొఫెసర్లకు లంచం ఇచ్చారని ఆరోపణలు రాగా, ఇద్దరు ప్రొఫెసర్లు డాక్టర్ వినయ్ వర్మ, మనీష్ గుప్తాలను సస్పెండ్ చే సినట్లు వీసీ పేర్కొన్నారు. విద్యార్థులకు ఎక్కువ మార్కులు వేసినట్లు వచ్చిన ఆరోపణలపై తాము కమిటీని ఏర్పాటు చేసినట్లు వీసీ తెలిపారు. కమిటీ తన నివేదికలో ఇది నిరూపితం అయినట్లు పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు ఉపాధ్యాయులను హెచ్చరించామన్నారు. అయితే దీనికి పాల్పడినఉపాధ్యాయులను తొలగించాలని కమిటీ సిఫార్సు చేసిందని, అయితే మోడల్ ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున కోడ్ ఎత్తివేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
‘నేను రాజకీయాల్లోకి రావాలని దేశమంతా కోరుకుంటుంది’
డెహ్రాడూన్: దేశం మొత్తం తాను క్రీయాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని కోరుకుంటుందని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ కంచుకోట ఆమేథీ నుంచి పోటీచేస్తారని గత కొన్నిరోజులుగా ఉహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. తాజాగా రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘దేశం మొత్తం నుంచి ఒకటే అభిప్రాయం వినిపిస్తోంది. దేశ ప్రజలంతా తాను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. ప్రజలు తనను వారి ప్రాంతాల్లో ఉండాలని ఆశిస్తున్నారు. నేను 1999లోనే ఆమెథి ప్రచారంలో పాల్గొన్నాను. ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న స్మృతి ఇరానీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చలేదు. గడిచిన రెండు విడతల్లోను కాంగ్రెస్ పార్టీ ముందజలోనే కొనాసాగుతోందని పేర్కొన్నారు. ‘దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. బీజేపీతో ప్రజలు తీవ్రంగా విసిగిపోయారు. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ శ్రమను దేశ ప్రజలు చూస్తున్నారు. గాంధీ కుటుంబం వెంటే దేశ ప్రజల ఉన్నారు’ అని రాబర్ట్ వాద్రా అన్నారు. ఆయన తనకు రాజకీయాల్లోకి రావాలని, ఎంపీగా పోటీ చేయాలన్న కోరికను ఉన్నట్లు ఇలా పరోక్షంగా వెల్లడిస్తున్నారని పార్టీ శ్రేణులో తీవ్ర చర్చ జరుగుతోంది.అమెథిలో గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన స్మృతి ఇరానీ సమీప కాంగ్రెస్ అభ్యర్థి అయిన రాహుల్ గాంధీని ఓడించిన విషయం తెలిసిందే. మళ్లీ ఈసారి కూడా బీజేపీ అమెథి సెగ్మెంట్ నుంచి స్మృతి ఇరానీకి టికెట్ కేటాయించింది. -
నా భార్య రూ.54 లక్షల అప్పుంది: మాజీ సీఎం
లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, దివంగత ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కన్నౌజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు.తన అభ్యర్థిత్వంతో పాటుగా ఆస్తులు, అప్పులకు సంబంధించిన అఫిడవిట్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. తన వద్ద రూ. 26.34 కోట్ల ఆస్తులు ఉన్నాయని, తన జీవిత భాగస్వామి డింపుల్ యాదవ్ ఆస్తుల విలువ రూ.15 కోట్లకు పైగా ఉన్నట్లు అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. దీంతో ఆయన మొత్తం కుటుంబ ఆస్తులు రూ.41.88 కోట్లకు చేరాయి.అఖిలేష్ యాదవ్ తన అఫిడవిట్లో తన భార్య డింపుల్ యాదవ్ తనకు రూ. 54 లక్షల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే తన వద్ద 1.60 లక్షల విలువైన మట్టి, పింగాణి పాత్రలు ఉన్నట్లు వెల్లడించడం విశేషం. అఖిలేష్ చేతిలో రూ.25.61 లక్షల నగదు, రూ.5.41 కోట్ల బ్యాంకు వాల్ట్లు ఉన్నాయి.లిక్విడ్ క్యాష్ రూపంలో డింపుల్ యాదవ్ వద్ద రూ.5.72 లక్షలు, వివిధ బ్యాంకింగ్ సంస్థల్లో రూ.3.75 కోట్లు ఉన్నాయి. ఆమె వద్ద 2.77 కేజీల బంగారంతో కూడిన రూ.59.76 లక్షల విలువైన నగలు ఉన్నాయి. ఇక అఖిలేష్ చరాస్తుల్లో రూ.9.12 కోట్లు, స్థిరాస్తుల్లో రూ.17.22 కోట్లు పెట్టుబడి పెట్టారు. కాగా, డింపుల్ చరాస్తుల విలువ 5.10 కోట్లు. ఆమెకు రూ.10.44 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.
Related News by category
-
Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
నేలలో నుంచి 606 పురుగుమందులు, రసాయనాలను తొలి ఏడాదే నిర్మూలించవచ్చు. తొలి ఏడాదిలోనే పంట దిగుబడులు తగ్గకపోగా పెరుగుతాయి.. ఏ కల్మషమూ లేని పోషకాల సాంద్రతతో కూడిన సేంద్రియ ఆహారోత్పత్తుల దిగుబడి సుసాధ్యమే! జీవ ఇంధనం ఉత్పత్తి, కార్బన్ క్రెడిట్స్ పొందటానికీ అవకాశం ఉంది. మహేశ్ మహేశ్వరి ‘మిరకిల్’ కృషిపై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం..మట్టిలో సత్తువను లేదా ఉత్పాదక శక్తిని కొలిచేందుకు ఒక సాధనం సేంద్రియ కర్బనం (సాయిల్ ఆర్గానిక్ కార్బన్– ఎస్.ఓ.సి.). సేంద్రియ కర్బనం మన భూముల్లో 0.2 నుంచి 0.5 మధ్యలో ఉందని అనేక అధ్యయనాల్లో తేలింది. ఈ భూముల్లో పండించిన ఆహారంలో పోషకాల సాంద్రత లోపించి, ఆ ఆహారం తిన్నవారికి పౌష్టికాహార లోపం వస్తోందని కూడా మనకు తెలుసు.సేందియ కర్బనం 1% కన్నా ఎక్కువ ఉంటే పంటలు బాగా పండటంతో పాటు చీడపీడల బెడద కూడా తగ్గుతుందని చెబుతారు. దీన్ని 2%కి పెంచుకోగలిగితే ఆ భూములు నిజంగా బంగారు భూములే అంటారు. పదేళ్లుగా శ్రద్ధాసక్తులతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న అతికొద్ది మంది రైతులు తమ భూముల్లో సేంద్రియ కర్బనాన్ని 2% వరకు పెంచుకోగలగటం మనకు తెలిసిందే.అయితే, ఒక్క ఏడాదిలోనే సేంద్రియ కర్బనాన్ని ఏకంగా 6 శాతానికి పెంచుకునే ‘అద్భుత సజీవ సేద్య పద్ధతుల’ను కనిపెట్టామని అహ్మదాబాద్ (గుజరాత్) కు చెందిన మహేశ్ మహేశ్వరి అనే ఆవిష్కర్త ఘంటాపథంగా చెబుతున్నారు. రసాయనిక వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయానికి మారే రైతులు తొలి ఏడాదిలోనే దిగుబడి పెంచుకునేందుకు ఈ పద్ధతులు తోడ్పడుతున్నాయని ఇప్పటికే 130 మంది రైతుల ద్వారా ఆచరణలో రుజువైందన్నారు.సజీవ సేద్యం వివరాలు చెబుతున్న సెజెల్ మహేశ్వరిఅనేక ఏళ్ల క్రితం నుంచి తాము జరిపిన పరిశోధనల ఫలితంగా ఈ అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని మిరకిల్స్ అగ్రి గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు మహేశ్ మహేశ్వరి, ఆయన సోదరి సెజెల్ మహేశ్వరి తెలిపారు.అహ్మదాబాద్లోని స్వామి నారాయణ్ విద్యా సంస్థాన్ ఆవరణలోని వీరి పరిశోధనా వ్యవసాయ క్షేత్రాన్ని ఇటీవల సందర్శించిన ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధితో వారు తమ ‘సజీవ సేద్యం’ గురించి ఎన్నెన్నో ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన, ఆచరణాత్మకమైన, పరీక్షల్లో నిర్థారిత అనుభవాలను పంచుకున్నారు.వెన్ను కేన్సర్ను జయించి..58 ఏళ్ల మహేశ్ మహేశ్వరి మెకానికల్ ఇంజనీర్, చార్టర్డ్ ఎకౌంటెంట్. ఐఐఎం ఆహ్మదాబాద్లో ఎంబీఏ పూర్తి చేశారు. 2011లో వెన్నుపూస కేన్సర్ బారిన పడిన ఆయన ఐదారేళ్లు మంచానికే పరిమితమయ్యారు. ఆ క్రమంలో జరిపిన అధ్యయనంలో వ్యవసాయ రసాయనాలతో కూడిన ఆహారం వల్ల కడుపులోని సూక్ష్మజీవరాశి (గట్ మైక్రోబ్స్) నశించటమే కేన్సర్ రావటానికి ఒక మూల కారణమని 2013–14లో గుర్తించారు.ఆ క్రమంలో కొన్నేళ్లపాటు జరిపిన పరిశోధనల ఫలితంగా కేన్సర్ను జయించి పునరుజ్జీవం పొందారు! అంతేకాకుండా.. మట్టిలో పేరుకుపోయిన వ్యవసాయక రసాయనాల అవశేషాలను వేగవంతంగా ఒకే సంవత్సరంలో నిర్మూలించటంతో పాటు, పోషకాల సాంద్రతతో కూడిన స్వచ్ఛమైన సేంద్రియ ఆహారోత్పత్తులను పండించుకునేందుకు వీలుకల్పించే అద్భుత ద్రవ, ఘన ఎరువులను.. బయో పెస్టిసైడ్స్ను ఆవిష్కరించారు.తాగు/సాగు నీటిలో.. తినే ఆహారంలో పోషకాల సాంద్రత, సమగ్రతతో పాటు రసాయనిక అవశేషాలను పూర్తిగా నిర్మూలించటం ద్వారా ప్రజలకు పౌష్టికాహార, ఆరోగ్య భద్రత చేకూరుతుంది. రైతులకు ఆదాయ భద్రత లభిస్తుందని, గోశాలలకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుందని అంటారు మహేశ్.పురుగుమందుల అవశేషాలు ఏడాదిలోనే విచ్ఛిన్నం!రసాయనిక వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయం వైపు మారే రైతులకు గో ఆధారిత సజీవ సేద్య పద్ధతి చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఈ పద్ధతిలో దేశీ ఆవును డీటాక్స్ చేసిన తర్వాత సూక్ష్మజీవరాశి పెరిగిన శుద్ధమైన పేడ, మూత్రం వాడుతాం. వీటితో తయారు చేసే సేంద్రియ ఎరువులో పంటల వేర్లు ఉపయోగించుకోవడానికి అనువైన రూపంలో ఉండే కర్బనం 30–40% అధికంగా ఉంది.ట్యూబ్ నుంచి బయటికి వస్తున్న జీవామృతంమట్టిలో సేంద్రియ కర్బనాన్ని వెనువెంటనే 2%కి పెంచే సామర్థ్యం దీనికి ఉంది. హెచ్డిపిఇ ట్యూబ్ ద్వారా యాక్టివేటెడ్ కార్బన్ అడ్వాన్స్డ్ ద్రవ జీవామృతం క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే సేంద్రియ కర్బనం ఏడాదిలో 6% వరకు పెరుగుతుంది. ట్యూబ్లో ఆవు పేడ, మూత్రంతో పాటు కూరగాయలు, పండ్ల వ్యర్థాలను కూడా వేస్తాం.అవి 30 రోజుల్లో పూర్తిగా కుళ్లిపోతాయి. నలకలు కూడా లేని శుద్ధమైన ద్రవజీవామృతం లభిస్తుంది. ఇందులో మొక్కలకు లభ్య రూపంలోని కర్బనం 15% వరకు ఉంటుంది. సాధారణ జీవామృతంలో 2–3% మాత్రమే ఉంటుంది.ఎకరానికి రూ. 10 లక్షలు..లైవ్ వాటర్ బయో చిప్ ద్వారా టీడీఎస్ తగ్గించి, పిహెచ్ న్యూట్రల్ చేసి జీవవంతంగా మార్చిన నీటిని పంటలకు, పశువులకు అందిస్తున్నాం. జొన్న+సజ్జ కలిపి తయారు చేసిన నేపియర్ గడ్డి దిగుబడి సాధారణంగా ఎకరానికి ఏడాదికి 100–150 క్వింటాళ్లు వస్తున్నది. రైతుకు రూ. 2–4 లక్షల ఆదాయం వస్తోంది.మా పద్ధతి పాటిస్తే ఎకరానికి ఏడాదిలో 500–1,000 టన్నుల సేంద్రియ గడ్డి ఉత్పత్తి అవుతుంది. 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఇందులో 16% ్రపొటీన్, 7% కొవ్వు, 10% సుగర్ ఉంటుంది. ఆదాయం కనీసం ఎకరానికి ఏటా రూ.10 లక్షలు వస్తుంది. ఈ గడ్డిని కనీసం పదెకరాలు ఒకచోట సాగు చేస్తే.. పెలెట్లు తయారు చేయొచ్చు. పశువులకు, కోళ్లకు, చేపలకు దాణాగా వేయొచ్చు. ఈ పెల్లెట్లను బాయిలర్లలో బొగ్గుకు బదులు బయో ఇంధనంగా వాడొచ్చు.నీటిని శుద్ధి చేసే చిప్ఈ సేంద్రియ గడ్డి వల్ల, 12 రకాల హైడ్రోపోనిక్ మొలక గడ్డి మేపు వల్ల ఆవుల ఆరోగ్యం, పాల నాణ్యత, కొవ్వు శాతం గణనీయంగా పెరుగుతాయి. ఆవు నిర్వహణ ఖర్చు 70–80% తగ్గిపోతుంది. పాలివ్వని ఆవుల ద్వారా కూడా రైతులకు, గోశాలలకు ఆదాయం పెరుగుతుంది. సజీవ సేద్యం వల్ల రైతులకు ఎరువులు, పురుగుమందుల ఖర్చు మూడేళ్లలో దశలవారీగా 50% తగ్గుతుంది. మొదటి ఏడాది కూడా దిగుబడి తగ్గదు.దిగుబడి 3 ఏళ్లలో 50–75% పెరుగుతుంది. మట్టిలోని 606 రకాల రసాయనిక పురుగుమందుల అవశేషాలు మొదటి ఏడాదే విచ్ఛిన్నమైపోతాయి. నేల, పంట దిగుబడులు కూడా మొదటి ఏడాదిలోనే పూర్తి ఆర్గానిక్గా మారిపోతాయి. పౌష్టిక విలువలు మాత్రం మూడేళ్లలో దశలవారీగా ఏడాదికి 25% పెరుగుతుంది.– మహేశ్ మహేశ్వరి -సజీవ సేద్యం ఆవిష్కర్త, ఆహ్మదాబాద్, గుజరాత్,(సెజెల్ మహేశ్వరి –97256 38432 హిందీ/ ఇంగ్లిష్)miraclemoringa14@gmail.comప్రక్షాళన దేశీ ఆవుతోనేప్రారంభం!వ్యవసాయానికి, మన ఆహారానికి, మన నేలల ఆరోగ్యానికి దేశీ ఆవే కేంద్ర బిందువని మహేశ్ భావించారు. ఆవు పేడ, మూత్రం, పాలను జీవశక్తిమంతంగా, పోషకవంతంగా, రసాయన రహితంగా మార్చుకోవాలంటే.. ప్రక్షాళన ప్రక్రియను ఆవుతోనేప్రారంభించాలి. ఆవు దేహంలో పేరుకుపోయిన పురుగుమందుల ఆవశేషాలను నిర్మూలించాలి. అందుకోసం ఆవు దేహాన్ని శుద్ధి చేయటం, ముఖ్య వనరైన నీటిని శుద్ధి చేసుకోవటంతో ‘సజీవ సేద్యం’ప్రారంభమవుతుంది.ఆవు డీటాక్స్ ప్రక్రియకు 90 రోజులు పడుతుంది. ఆ తర్వాత పేడ, మూత్రం నుంచి దుర్వాసన రాదు. శుద్ధమైన దేశీ ఆవు పేడ, మూత్రంతో ప్రత్యేక పద్ధతిలో తయారు చేసుకునే అధిక కర్బనంతో కూడిన ద్రవ– ఘన ఎరువుల్లో జీవశక్తి, పోషకాలు, లభ్యస్థితిలోని కర్బనం అధిక పాళ్లలో ఉంటుంది.40 రకాల ఔషధ మొక్కల రసాలతో తయారు చేసే బయో పెస్టిసైడ్స్ వాడకంతో అతి తక్కువ కాలంలోనే మట్టిని పూర్తిగా శుద్ధి చేసి జీవశక్తి నింపి పునరుజ్జీవింప చేసుకోవటంతో వ్యవసాయ–ఆహార వ్యవస్ధను ఆసాంతం ప్రక్షాళన చేసే ఈ ప్రక్రియ పూర్తవుతుందని మహేశ్ విశదీకరించారు. ఇటువంటి స్వచ్ఛమైన ఆహారమే మనుషులకు, పశువులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వగలదని ఆయన అంటున్నారు.ఎకోసెర్ట్ సర్టిఫికేషన్..మహేశ్ మహేశ్వరి తన ఆవిష్కరణలపై పేటెంట్కు దరఖాస్తు చేశారు. వీరు ఆవిష్కరించిన ద్రవ రూప, ఘనరూప ఎరువులకు, జీవన పురుగుమందులు ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ (ఎఫ్సిఓ) ప్రమాణాలకు తగినట్లుగా ఉన్నాయని భారత ప్రభుత్వం సర్టిఫై చేసింది. ఈ ఉత్పత్తులతో కూడిన సజీవ సేద్య పద్ధతికి అంతర్జాతీయ ‘ఎకోసెర్ట్’ సర్టిఫికేషన్ సైతం లభించటం విశేషం. ఈ సర్టిఫికేషన్కు 130 దేశాల్లో గుర్తింపు ఉంది. - నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
Archana Sinha: అలా వచ్చిన ఆలోచనే.. ఈ 'ఎన్ఎస్ఎఫ్'..
పిల్లలు, ఆటలు, పాటలు ఒకే కుటుంబం. ఆటపాటలంటే పిల్లలకు బోలెడు ఇష్టం. ఆ ఇష్టాన్ని దృష్టిలో పెట్టుకొని పోషకాహారం నుంచి పరిసరాల పరిశుభ్రత వరకు ఎన్నో కాన్సెప్ట్లను ఆటల రూపంలో డిజైన్ చేసిన బెంగళూరుకు చెందిన నరిషింగ్ స్కూల్స్ ఫౌండేషన్(ఎన్ఎస్ఎఫ్) వారి కృషి వృథా పోలేదు. స్కూల్ గార్డెన్ నుంచి గ్రూప్ యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గొనడం వరకు పిల్లల్లో ఎంతో సానుకూల మార్పు కనిపిస్తోంది..ప్రభుత్వ పాఠశాలలకు వెళుతూ పిల్లల వయసు, ఎత్తు, బరువు.. మొదలైన విషయాల ఆధారంగా బేస్లైన్ సర్వేలు నిర్వహిస్తోంది ఎన్ఎస్ఎఫ్ ఫౌండేషన్. సర్వే ఫలితాల గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయడమే కాదు తగిన సూచనలు కూడా ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకోవడానికి ఈ సర్వే ఫలితాలు ఉపయోగపడుతున్నాయి.‘పారిశుధ్య ప్రాముఖ్యత, సరైన పౌష్టికాహారం గురించి పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా టూల్ కిట్ ఆధారిత విధానానికి రూపకల్పన చేశాము. వారికి తగిన పరిజ్ఞానాన్ని అందించి ఆలోచనాపరులుగా మార్చడమే మా లక్ష్యం’ అంటుంది ఎన్ఎస్ఎఫ్ కో–ఫౌండర్, సీయివో అర్చన సిన్హా.పోషకాహారం, పారిశుధ్యంతో పాటు నవీన వ్యవసాయ పద్ధతుల గురించి పిల్లలకు అవగాహన పరిచే పదిహేను గేమ్స్తో కూడిన టూల్కిట్లను ఎన్ఎస్ఎఫ్ ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలలకు అందిస్తోంది. పోషకాహార లోపాల లక్షణాలను గుర్తించడానికి ఈ టూల్కిట్లలోని ఎనిమీ కార్డ్, అలాగే... ఈ లోపాలను పరిష్కరించడానికి సహాయపడే ఆహార వనరుల గురించి తెలుసుకోవడానికి ఫ్రెండ్ కార్డు పిల్లలకు ఉపయోగపడుతుంది.వైకుంఠపాళిలోని పాములు, నిచ్చెనలతో కూడా పిల్లలు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. జంక్ ఫుడ్కు దూరంగా ఉండేవారి సత్ప్రవర్తనకు బహుమతులు, జంక్ ఫుడ్ను అమితంగా ఇష్టపడేవారికి ఈ ఆటలో శిక్షలు (పాముకాటు)లు ఉంటాయి. సబ్బు వాడకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడానికి ఆకట్టుకునే కాన్సెప్ట్కు రూపకల్పన చేశారు.టూల్కిట్స్ యాక్టివిటీల ద్వారా పిల్లలు స్కూల్ గార్డెన్లను పెంచుతున్నారు. వారికి ఇచ్చిన గైడ్బుక్లో వెజిటేబుల్ క్యాలెండర్, మొక్కల పెంపకానికి సంబంధించి స్టెప్–బై–స్టెప్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. టూల్కిట్లు పిల్లలపై ఏ మేరకు ప్రభావం చూపాయి... అనే విషయంలో ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తుంటుంది ఫౌండేషన్.‘పిల్లల ఆహారపుటలవాట్లపై టూల్కిట్స్ సానుకూల ప్రభావం చూపించడమే కాదు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. గ్రూప్ యాక్టివిటీలలో చురుగ్గా పాల్గొనేలా చేస్తున్నాయి’ అంటుంది ఒకిత ఎం అనే గృహిణి. ‘ప్రభుత్వ పాఠశాలలతో పోల్చితే ప్రైవేట్ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగ్గా ఉండవచ్చు. అయితే ఊబకాయంలాంటి సమస్యలు ఉన్నాయి’ అంటుంది అర్చన సిన్హా. త్వరలో ప్రైవేట్ స్కూల్స్లోకూడా ఆన్లైన్ మాడ్యుల్ అందుబాటులోకి తీసుకు రానున్నారు. ‘ఎన్ఎస్ఎఫ్’ దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రభుత్వ పాఠశాలల్లో యాక్టివిటీ ్రపోగ్రామ్స్ నిర్వహించింది. వేలాదిమంది విద్యార్థులపై ఇవి సానుకూల ప్రభావం చూపుతున్నాయి.అలా వచ్చిన ఆలోచనే.. ఎన్ఎస్ఎఫ్..జర్నలిస్ట్గా కెరీర్ మొదలు పెట్టిన అర్చన సిన్హా ఆ తరువాత మేనేజ్మెంట్ అండ్ కన్సల్టింగ్లోకి వచ్చింది. సామాజికసేవా కార్యక్రమాలు అంటే మొదటి నుంచి ఇష్టం ఉన్న అర్చన ‘అశోక ఇన్నోవేటర్స్ ఫర్ ది పబ్లిక్’ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేసింది. ఒడిషాలోని గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడి మహిళలతో పౌష్టికాహారం గురించి మాట్లాడింది. అరుదుగా మాత్రమే వారు పౌష్టికాహారం గురించి పట్టించుకుంటున్నారు. పౌష్టికాహారం, పారిశుధ్యం గురించి వారికి అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించిన అర్చన ‘నరిషింగ్ స్కూల్స్ ఫౌండేషన్’కు శ్రీకారం చుట్టింది.ఇవి చదవండి: Priya Chhetri - 'ప్రియ'మైన విజయం -
Priya Chhetri: ప్రియమైన విజయం
రెండేళ్ల కిందట ... ప్రియా ఛత్రి ఒక నిస్సహాయ మహిళ. ఢిల్లీ, గుర్గావ్లో ఓ క్లినిక్ ముందు నిలబడి అగమ్యగోచరంగా ఉన్న భవిష్యత్తును ఊహించుకుంటూ కన్నీళ్ల పర్యంతమైంది. భర్త తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. పరీక్ష చేసిన డాక్టరు రాసిచ్చిన మందుల చీటీ ఆమె చేతిలో ఉంది. చీటీ అనడం అలవాటైన మాట, కానీ ఆమె చేతిలో ఉన్నది మందుల జాబితా. ఆ మందులు వాడాలంటే తను, భర్త సంపాదిస్తున్న డబ్బు చాలదు. మందులకు ఖర్చు చేస్తే ఇల్లు గడవదు. ఇల్లు గడిస్తే వైద్యం అందదు. తనేమో నాలుగు ఇళ్లలో పనులు చేస్తుంది. భర్త సంజీత్ ఒక ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సిలిగురి నుంచి బతుకుదెరువు కోసం దేశ రాజధాని బాట పట్టిన అనేక కుటుంబాల్లో ప్రియ కుటుంబం ఒకటి. ఇరవై నాలుగేళ్ల వయసులో జీవితం ఆమెకి పెట్టిన పరీక్ష అది. ఆ పరీక్షలో నెగ్గిన ప్రియ ఇప్పుడు సిలిగురిలో తోటి మహిళలకు రోల్ మోడల్ అయింది. ఇంతకీ ఆమె చేసిన పనేంటి అంటే... మనదేశంలో పండని పండ్లను, గింజలను ఇంటింటికీ చేర్చడమే. తాజాగా, నాణ్యంగా ఉన్న పండ్లను ఇస్తుందన్న విశ్వాసాన్ని చూరగొన్నది. ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ వారి వారి పనులు చేసుకుంటూనే పండ్ల వ్యాపారం చేస్తూ నెలకు ముఫ్పైవేల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇందుకు ఆమె పెట్టుబడి తన శ్రమ మాత్రమే. ఆమెకు అండగా నిలిచింది ఆమె పని చేస్తున్న ఇంటి యజమాని రాశి సోమన్ గొప్ప మనసు. జీవితం పండింది ప్రియ తన పండ్లు, గింజల వ్యాపారానికి తాను పని చేసే ఇళ్ల నుంచే కస్టమర్లను వెతుక్కుంది. తొలి ప్రయత్నంగా ఢిల్లీ మండి నుంచి పది అవకాడోలు తెచ్చింది. మూడు వందల ఆదాయం వచ్చింది. ‘‘రాశి అక్క నాకు ఢిల్లీలోని ఆజాద్పూర్ మండీకి తీసుకెళ్లి చూపించింది. మన దేశంలో అరుదుగా లభించే పరదేశీ పండ్ల గురించి వివరించింది. సాధారణంగా ఒక పండు హోల్సేట్ మార్కెట్ నుంచి తినేవారి చేతికి వచ్చే మధ్యలో ఎన్నో చేతులు మారుతుంది. అనేక దఫాలు రవాణా అవుతుంది. పండ్ల దుకాణానికి చేరి పండ్లు కొనేవారికి అందేలోపు వాడిపోయేవి, కుళ్లిపోయేవి ఎన్నో. దుకాణదారులు ఆ నష్టాలను కూడా బాగున్న పండ్ల మీదనే రాబట్టుకోవాలి. నేను మండీ నుంచి కొనే గింజలు, పండ్లు తక్కువ మోతాదులో ఉంటాయి. అవి కూడా నా కస్టమర్లకు అవసరమైన పండ్లనే తెస్తాను. కాబట్టి నా దగ్గర నిల్వ ఉండవు. తెచ్చిన రోజే కస్టమర్లకు చేరుస్తాను. అలాగే నాణ్యమైన పండ్లను మాత్రమే తెస్తాను. ఏరోజుకారోజు తాజా పండ్లను తినే వెసులుబాటును కల్పిస్తున్నాను. కాబట్టి నా దగ్గర క్రమం తప్పకుండా పండ్లు తెప్పించుకునే వాళ్లు 250 మంది ఉన్నారు. అందరినీ ఒక వాట్సాప్ గ్రూప్లో చేర్చాను. వారానికి ఒకసారి తెప్పించుకునే వాళ్లు ఆదివారం రోజు గూగుల్ ఫార్మ్లో వాళ్లకు అవసరమైనవి తెలియచేస్తారు. గురువారం వాళ్లకు అందచేస్తాను. ఇవి కాకుండా తాజా పండ్లు రోజూ తెప్పించుకునే వాళ్లకు అలాగే అందిస్తున్నాను. పండ్ల దుకాణంలో దరకంటే చాలా తక్కువగా లభిస్తుండడంతో నా ప్రయత్నం విజయవంతమైంది. రెడ్ గ్లోబ్ గ్రేప్స్, బ్లూ బెర్రీ, మాండేరియన్స్, గోల్డెన్ కివీ, గ్రీన్ కివీ వంటి పండ్లతోపాటు వాల్నట్స్, ఫిగ్, విదేశీ ఖర్జూరాలు, హాజిల్నట్, క్రాన్బెర్రీ, మంచి జీడిపప్పు, బాదం వంటివి 30 రకాలు అందిస్తున్నాను. నేను, సంజీత్ మా ఉద్యోగాలు చేసుకుంటూ ఈ వ్యాపారం చేస్తున్నాం. దీనిని వ్యాపారం, లాభాలు అనాలా లేక నేను అందిస్తున్న సర్వీస్కి లభిస్తున్న చార్జ్ అనాలో తెలియదు. కానీ నా పిల్లలు కూడా ప్యాకింగ్, డెలివరీ వంటి పనుల్లో సాయం చేస్తున్నారు. నాకు పద్దెనిమిదేళ్లకే పెళ్లయింది. దాంతో పదకొండవ తరగతితోనే చదువు ఆగిపోయింది. నాకున్న కొద్దిపాటి చదువుతో, నా శ్రమను పెట్టుబడి పెట్టాను. పెద్ద చదువులు చదివిన వాళ్లకంటే తక్కువేమీ కాదని ఈ ఏడాది మహిళాదినోత్సవం రోజు నా గురించి పేపర్లో రాశారు. అంతా మా యజమాని రాశి అక్క సహాయమే’’ అన్నది ప్రియా ఛత్రి. జీవితం ప్రతి ఒక్కరికీ పరీక్షలు పెట్టి విజేతలుగా నిలబెట్టాలని చూస్తుంది. ఆ పరీక్షలో విజయవంతమైన వాళ్లు విజేతలుగా నిలుస్తారు. పరీక్ష నుంచి పారిపోయిన వాళ్లు పరీక్షతోపాటు జీవితేచ్ఛను కూడా పోగొట్టుకున్న పరాజితులుగా మిగులుతారు. ప్రియా ఛత్రి తన జీవితానికి తానే రక్షణ గొడుగు పట్టుకుంది. -
ఇది కెమెరా అనుకుంటున్నారా..! కానే 'కాదు(రు)'
మనం ఇప్పటివరకు ఎన్నోరకాల కార్లను గురించి విన్నాము, అలాగే చూశాము కూడా. కానీ ఈ వింతైన కారు గురించి విన్నారా! చూస్తే అచ్చం కెమెరా మాదిరిగా ఉంటుంది. ఇందులో డ్రైవర్ లేకుండా, నిద్రపోతూ కూడా ప్రయాణం చేయవచ్చట. మరి దీని గురించి పూర్తిగా తెలుసుకుందామా!ఇది అలాంటిలాంటి కారు కాదు. చక్రాల మీద నడిచే హోటల్ గదిలా ఉంటుందిది. దీనికి డ్రైవర్ కూడా అవసరం లేదు. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించేలాంటి ఈ డ్రైవర్లెస్ కాన్సెప్ట్ కారుకు ‘స్విఫ్ట్ పాడ్’ పేరుతో జర్మన్ కంపెనీ ‘జోయియో’కు చెందిన నిపుణులు రూపకల్పన చేశారు.ఇందులో ఇద్దరు ప్రయాణికులు ప్రయాణించవచ్చు. కూర్చోవడం బోరు కొట్టినప్పుడు లేదా నిద్రపోవాలనిపించినప్పుడు ఈ సీట్లను పరిచేసుకుంటే, అవి మంచాల్లా మారిపోతాయి. నిద్రపోతూ కూడా సుదూర ప్రయాణాలు సాగించడానికి వీలుగా ‘జోయియో’ నిపుణులు ఈ కారుకు రూపకల్పన చేయడం విశేషం. ఇందులోని నేవిగేషన్ సిస్టమ్ ద్వారా చేరుకోవలసిన దూరాన్ని, సమయాన్ని సెట్ చేసుకుంటే, అందుకు అనుగుణంగా ఈ కారు తన వేగాన్ని పుంజుకుంటుంది.కాస్త తీరిక ఉంటే, మార్గమధ్యంలో ఆగాల్సిన ప్రదేశాలను ఎంపిక చేసుకుంటే, ఈ కారు ఆయా ప్రదేశాల్లో ఆగుతూ, కోరుకున్న రీతిలో ప్రయాణం సాగిస్తుంది. ఈ కారును ఎప్పుడు అందుబాటులోకి తేనున్నదీ ‘జోయియో’ కంపెనీ ఇంకా వెల్లడించలేదు.ఇవి చదవండి: కొత్త టెక్నాలజీ పరికరాలతో ఆరోగ్య సమస్యలకు చెక్.. -
టైటానిక్ ప్రమాదంలో మరణించిన వ్యాపారవేత్త గోల్డ్ వాచ్ వేలం : ధర తెలిస్తే
ప్రపంచంలోని అత్యంత విషాదాల్లోఒకటి టైటానిక్ నౌక మునిగిపోయిన ఘటన. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక కథనాలు, విశేషాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. టైటానిక్లోప్రయాణించిన అత్యంత ధనవంతుడికి బంగారు పాకెట్ వాచ్ రికార్డు ధరకు అమ్ముడు కావడం వార్తల్లో నిలిచింది. టైటానిక్ నౌక ప్రమాదంలో మరణించిన ,న్యూయార్క్లోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త , రియల్ ఎస్టేట్ డెవలపర్ జాన్ జాకబ్ ఆస్టర్ (47)కు చెందిన గోల్డ్ పాకెట్ వాచ్ వేలంలో సరికొత్త రికార్డు సృష్టించింది. జేజేఏ అనే లక్షరాలతో రూపొందించిన ఈ వాచ్ అమెరికాలోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ వేలం సంస్థ శనివారం నిర్వహించిన వేలంలో ఈ వాచీని రూ.12.17 కోట్లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నారు. గతంలో వాలెస్ హార్ట్లీ బ్యాగ్ను , ఓడ మునిగిపోయేటపుడు బ్యాండ్మాస్టర్ వాయించిన ప్రసిద్ధ టైటానిక్ వయోలిన్ను కూడా వేలం వేశారు. ఏప్రిల్ 15, 1912న సౌతాంప్టన్ నుండి న్యూయార్క్ నగరానికి బయలుదేరిన తొలి ప్రయాణంలో ఓడ మంచుకొండను ఢీకొట్టి ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమంలో1500 మందిమరణించారు. గర్భవతి అయిన జాకబ్ భార్య మడేలిన్ ప్రాణాలతో బయటపడింది. జాకబ్పై శరీరంపై గడియారం, బంగారు కఫ్లింక్లు, డైమండ్ రింగ్, డబ్బు, పాకెట్బుక్ తదితర వస్తువులను తరువాతి కాలంలో ఆస్టర్ కుమారుడు విన్సెంట్ ఆస్టర్కు అప్పగించారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
విశ్వసనీయతే విజయానికి మెట్టు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- కబ్జాల కందికుంట
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
Advertisement