వెల్దుర్తి: పల్నాడు ప్రజల చిరకాల వాంఛ వరికపూడిసెల ఎత్తిపోతల పథకం నిర్మాణానికి కావాల్సిన అన్ని అనుమతులనూ సాధిస్తామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. మండలంలోని గుండ్లపాడు గ్రామంలో రూ.25 లక్షలతో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని సోమవారం పిన్నెల్లి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఏడు దశాబ్దాల నుంచి నిరీక్షిస్తున్న వరికపూడిసెల ఎత్తిపోతల పథకం నిర్మాణానికి నెల రోజులలోనే అనుమతులు తీసుకొచ్చేందుకు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలుతో కలిసి కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర మంత్రివర్గం ఈ పథకం నిర్మాణానికి రూ.1,273 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపిందన్నారు. గతంలో శ్రీశైలంలో పెరిక సామాజికవర్గ అన్నదాన సత్రం స్థలం కోసం ఎన్ని యత్నాలు జరిగినా ఫలితం లేకపోయిందని, సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పడగానే సత్రం నిర్మాణం కోసం 50 సెంట్ల స్థలాన్ని మంజూరు చేయించి కమిటీ సభ్యులకు అప్పగించామని గుర్తుచేశారు. గుండ్లపాడు గ్రామస్తులకు నాలుగేళ్లలో రూ.20.61 కోట్ల మేర ప్రయోజనం కల్పించామని, ఊరగుంట అభివృద్ధికి రూ.25 లక్షలు మంజూరు చేయించామని పేర్కొన్నారు. రైతులకు గోడౌన్ను నిర్మించేందుకు రూ.15 లక్షల నిధులు విడుదలయ్యాయని వెల్లడించారు. అనంతరం గుండ్లపాడు గ్రామ పంచాయతీ ఇన్చార్జి సర్పంచ్గా తోట నారాయణ పదవీబాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు సర్పంచ్గా పనిచేసిన తోట వెంకయ్య దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళటంతో నారాయణను ఎంపీడీఓ ప్రసాద్ ఇన్చార్జి సర్పంచ్గా నియమించి ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే పీఆర్కే పెద్దమనుషుల ఒప్పందాన్ని గౌరవించిన వెంకయ్యను, కొత్తగా బాధ్యతలు చేపట్టిన నారాయణను అభినందించి సన్మానించారు.
వరికపూడిసెలకు అన్ని అనుమతులూ సాధిస్తాం
Published Tue, Apr 11 2023 1:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement