నిమ్మగడ్డ వారిపాలెంలో కేంద్ర బృందం పర్యటన | Sakshi
Sakshi News home page

నిమ్మగడ్డ వారిపాలెంలో కేంద్ర బృందం పర్యటన

Published Wed, Aug 30 2023 2:08 AM

నిమ్మగడ్డవారిపాలెంలో మంచినీటి చెరువును పరిశీలిస్తున్న కేంద్ర బృందం  - Sakshi

ప్రత్తిపాడు: మండల పరిధిలోని నిమ్మగడ్డ వారిపాలెంలో మంగళవారం కేంద్ర బృందం పర్యటించింది. ఫౌండేషన్‌ ట్రైనింగ్‌లో భాగంగా ఆరుగురు బృందంతో కూడిన సెంట్రల్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు భారత్‌ దర్శన్‌ నిమిత్తం గ్రామాలను సందర్శిస్తున్నారు. అందులో భాగంగా ప్రత్తిపాడు మండలం నిమ్మగడ్డ వారి పాలెం గ్రామంలో మహాత్మాగాంధీ జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అమృత సరోవర్‌ పథకం కింద అభివృద్ధి చేసిన రక్షిత మంచినీటి చెరువును పరిశీలించారు. చెరువు చుట్టూ గట్లపై నాటిన ప్లాంటేషన్‌ను పరిశీలించారు. పథకం వివరాలను స్థానిక ఏపీవో షేక్‌ మస్తాన్‌ వలి వివరించారు. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలు అమలు చేస్తున్న పలు పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. వెంట ఏపీఎస్‌ఐఆర్డీ నోడల్‌ ఆఫీసర్‌ ఏ శేఖర్‌ బాబు, ఈవోపీఆర్డీలు శ్రీనివాసరావు, మోషే, సర్పంచ్‌ జి. పద్మావతి సతీష్‌, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement