పెదకాకాని: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండలంలోని వెనిగండ్ల జిల్లా పరిషత్ పాఠశాలలో రాష్ట్రస్థాయి అండర్– 14 సాఫ్ట్బాల్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆదివారానికి రెండో రోజుకు చేరిన పోటీల్లో బాలబాలికల విభాగాల్లో 13 జిల్లాల నుంచి 476 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. శని, ఆదివారాల్లో లీగ్ పద్ధతిలో నిర్వహించిన పోటీల్లో ఫైనల్కు కడప, విజయనగరం బాలుర జట్లు, బాలికల విభాగంలో కర్నూలు, విజయనగరం జట్లు చేరాయి. చివరి రోజు సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోటీల అనంతరం విజేతల్ని ప్రకటిస్తామని, సాయంత్రం విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామని టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పేరం మస్తాన్ రెడ్డి తెలియజేశారు.
ఉత్సాహంగా క్యాంప్ ఫైర్
పోటీల్ని పురస్కరించుకుని రాత్రి నిర్వహించిన క్యాంప్ ఫైర్లో ఆయా జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఉత్సాహంగా, ఉల్లాసంగా స్టెప్లు వేస్తూ ఆనందంగా సందడి చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నంబూరు తిరుపతిరావు, టోర్నమెంట్ జిల్లా కార్యదర్శి జగదీశ్వరరెడ్డి, టోర్నమెంట్ పరిశీలకులు చంటిబాబు, వరప్రసాద్, నందకుమార్, ప్రశాంత్బాబు, ఎండీ. బేగం, సునీత, శివశంకర్, హృదయరాజు పాల్గొన్నారు. క్రీడాకారులకు వసతి, భోజనం సౌకర్యాల్ని ఉపాధ్యాయులు ఎస్. వెంకట్రెడ్డి, జోసెఫ్, సుధాకరరెడ్డి, పర్యవేక్షించారు.
నేటితో ముగియనున్న అండర్–14 రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలు
బాలికల విభాగంలో ఫైనల్కు చేరిన కర్నూలు, విజయనగరం జట్లు