టీటీడీ అన్నదానానికి కూరగాయలు పంపిణీ | Sakshi
Sakshi News home page

టీటీడీ అన్నదానానికి కూరగాయలు పంపిణీ

Published Mon, Nov 20 2023 1:42 AM

- - Sakshi

మార్టూరు: టీటీడీ నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా ఆదివారం మార్టూరు నుంచి దాతల సాయంతో తిరుమలకు కూరగాయలు పంపించారు. విజయవాడ కూరగాయల మార్కెట్‌ నుంచి ప్రత్యేకంగా అలంకరించిన కూరగాయల లారీ స్థానిక స్టేట్‌ బ్యాంక్‌ సెంటర్‌లోకి రాగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక మహిళలు కోలాట ప్రదర్శన నిర్వహించారు. ఇదే క్రమంలో స్థానిక గ్రానైట్‌ వ్యాపారులు శ్రీశైలం నిత్యాన్నదానానికి అవసరమైన నిత్యావసర సరుకులను లారీకి నింపగా రెండు లారీలను రెండు ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా భక్తులకు టీటీడీ లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement