తొలికాన్పులోనే బిడ్డ అడ్డం తిరగడంతో మా కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. ఇక్కడి డాక్టర్లు రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. మందులు అన్నీ ఉచితంగానే ఇచ్చారు.
– చేగూరి అపర్ణ,
చిలకలూరిపేట, పల్నాడు జిల్లా
నాకు ఇది తొలి కాన్పు. ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాలన్నారు. ఆందోళనకు గురయ్యా. డాక్టర్లు భరోసా ఇచ్చి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం నేను, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాం.
బి.శిల్పాబాయి,
నాగరాజుపల్లె, బాపట్ల జిల్లా
ఇది నాకు రెండో కాన్పు. ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఇక్కడి వైద్య సిబ్బంది ఎంతో శ్రద్ధగా చూసుకున్నారు. డాక్టర్లు ఽఽధైర్యం చెప్పారు. రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం అందించారు. ఇలాంటి ఆసుపత్రులు పేదల జీవితాలకు భరోసా కల్పిస్తాయి. –వల్లెపు సరస్వతి,
ఉప్పరపాలెం, పల్నాడు జిల్లా
ఆస్పత్రిలో సమస్యలూ లేవు. ఆవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని సమకూరుస్తున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారు.