నా వయస్సు 66 ఏళ్లు. మారీసుపేటలో ఒంటరిగా ఉంటున్నా. భర్త గతంలోనే మృతి చెందారు. కుమార్తెకు పెళ్లయిపోయింది. నేను వంట పని చేస్తూ జీవిస్తున్నాను. ప్రభుత్వం ఇచ్చే పింఛన్, అప్పుడప్పుడు వంట పని ద్వారా వచ్చే కూలితో జీవిస్తున్నా. ప్రతినెలా వైద్యసిబ్బంది ఇంటికే వచ్చి ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు. అవసరమైతే వైద్యులూ ఇంటికి వస్తున్నారు. మందులు ఇస్తున్నారు. ఇటీవల కళ్ల సమస్య వచ్చింది. ప్రైవేటు ఆస్పత్రిలో చూపించే స్తోమత లేదు. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిబిరాన్ని మా ఇంటి దగ్గరే ఏర్పాటు చేశారు. అక్కడకు వెళ్తే వైద్యులు చూసి కంటి చుక్కల మందు ఇచ్చారు. తగ్గిపోయింది. జగన్బాబుకు కృతజ్ఞతలు.
– కోట సావిత్రి, మారీసుపేట, తెనాలి