బాపట్ల: జిల్లా బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుగా వెదురుపర్తి లక్ష్మణ్మూర్తి, బొలిశెట్టి నరసింహస్వామిలు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. స్థానిక ఓ హోటల్లో శుక్రవారం జరిగిన సమావేశంలో జిల్లాలోని పర్చూరు, అద్దంకి, మేదరమెట్ల, కర్లపాలెం, చెరుకుపల్లి, రేపల్లె సంఘాల నుంచి పలువురిని సభ్యులుగా ఎన్నుకున్నారు.
కార్యవర్గం ఇలా..
బాపట్ల జిల్లా అసోసియేషన్ కార్యవర్గం జిల్లా అధ్యక్షుడిగా వెదురుపర్తి లక్ష్మణమూర్తి, గౌరవ అధ్యక్షుడు మోదడుగు నరేష్ గుప్తా, సెక్రటరీ బొలిశెట్టి నరసింహస్వామి, ట్రెజరర్ సాధు సత్యనారాయణ, కరస్పాండెంట్గా దొడ్డ రామకృష్ణలు ఎన్నికయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి విజయకుమార్ మాట్లాడుతూ అసోసియేషన్కు రాష్ట్ర సంఘం నుంచి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. బులియన్ ఎగ్జిబిషన్ డిసెంబర్8,9,10 తేదీలలో విజయవాడలో జరగనుందని, అందరూ పాల్గొనాలని సూచించారు.