వైఎస్‌ జగన్‌ మళ్లీ సీఎం కావాలంటూ పాదయాత్ర | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ మళ్లీ సీఎం కావాలంటూ పాదయాత్ర

Published Mon, Nov 27 2023 1:16 AM

- - Sakshi

యడ్లపాడు: ‘మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలంటూ’ శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణం నుంచి తిరుమలకు చేపట్టిన పాదయాత్ర ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోకి ప్రవేశించింది. వైఎస్సార్‌ సీపీ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర యాదవసంఘం అధ్యక్షులు గురునాథ యాదవ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర బృందానికి బోయపాలెంలో గ్రామ సర్పంచి వడ్డేపల్లి నరసింహారావు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గురునాథ యాదవ్‌ మాట్లాడుతూ ఈనెల 8వ తేదీన టెక్కలి పట్టణం నుంచి ప్రారంభమైన తమ పాదయాత్ర సుమారు వెయ్యి కిలోమీటర్ల మేర కొనసాగుతుందన్నారు. ఏపీలోని కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మీదుగా డిసెంబర్‌ ఐదో తేదీన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రాన్ని చేరుకుంటామని చెప్పారు. గత నాలుగేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి పాదయాత్ర ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పాదయాత్ర బృందంలో కుమారస్వామి, పి.పాపారావు, కె.నవీన్‌, సాయికుమార్‌, కె.జగదీష్‌ ఉన్నారు.

Advertisement
Advertisement