Sakshi News home page

పెదకాకాని పీఎస్‌ పోలీస్‌ సిబ్బందికి ఎస్పీ అభినందన

Published Tue, Dec 5 2023 5:14 AM

- - Sakshi

నగరంపాలెం: బీడీఎస్‌ విద్యార్థిని హత్య కేసులో నిందితుడికి శిక్ష పడేలా దర్యాప్తు చేపట్టిన పెదకాకాని పోలీసులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను జిల్లా ఎస్పీ ఆరిఫ్‌హఫీజ్‌ అభినందించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన తపస్వి (21) బ్యాచిలర్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ (బీడీఎస్‌) తృతీయ సంవత్సరం చదివేది. అదేజిల్లా ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ జ్ఞానేశ్వర్‌ ఆమెను ప్రేమించమని వేధించేవాడు. ఈ క్రమంలో గుంటూరు తక్కెళ్లపాడులోని సహచర డెంటల్‌ విద్యార్థిని రూంలో ఆమె ఉంటుంది. దీంతో ఆమెను అతను గతేడాది డిసెంబర్‌ ఐదో తేదీ రాత్రి సర్జికల్‌ బ్లేడ్‌తో గొంతు కోశాడు. ఆమెను ఆస్పత్రికి తరలించగా మృతిచెందింది. అప్పట్లో ఈ హత్య సంచలనం రేకెత్తించింది. దీనిపై పెదకాకాని పీఎస్‌ సీఐ సురేష్‌బాబు, సిబ్బంది దర్యాప్తు చేపట్టారు. ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్‌ జడ్జి(పీడీజే) కోర్టు న్యాయమూర్తి సోమవారం ముద్దాయికి జీవిత కాలం కఠిన కారాగార శిక్ష, రూ.6 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ క్రమంలో పెదకాకాని పీఎస్‌ సీఐ సురేష్‌బాబు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎండీ సుల్తాన్‌ సిరాజుద్దీన్‌, పోలీస్‌ సిబ్బందిని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ అభినందించారు.

Advertisement
Advertisement