నేస్తమా... కుశలమా ! | Sakshi
Sakshi News home page

నేస్తమా... కుశలమా !

Published Tue, Dec 19 2023 1:28 AM

సమ్మేళనంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు 
 - Sakshi

గుంటూరు ఎడ్యుకేషన్‌: మధ్యప్రదేశ్‌ విదీషాలోని ఎస్‌ఎస్‌ఎల్‌ జైన్‌ కళాశాలలో 1970లో పీజీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల నాలుగవ అపూర్వ కలయిక సోమవారం అమరావతి రోడ్డులోని ఓ ఫంక్షన్‌ హాల్లో నిర్వహించారు. వివిధ రంగాల్లో సేవలు అందించి విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న పూర్వ విద్యార్థులంతా ఆనందోత్సాహాలతో గడిపారు. తమ కళాశాల రోజులను గుర్తు తెచ్చుకున్నారు. సీనియర్‌ సిటిజన్లుగా కుటుంబ బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని, యోగక్షేమాల్ని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో సంఘ ప్రతినిధులు జంగా కనక బాపిరెడ్డితో పాటు గుంటూరుకు చెందిన పూర్వ విద్యార్థి, వ్యాపారవేత్త వై. సాంబశివరావు, టీఆర్‌కే ప్రసాద్‌, వెంకటరత్నం, కృష్ణారావు, గంగాధరరావు, ఆంజనేయులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement