అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు

Published Sat, Sep 16 2023 1:36 AM

 పనులు తనిఖీ చేస్తున్న గ్రేటర్‌ కమిషనర్‌ రిజ్వాన్‌ బాషా  - Sakshi

వరంగల్‌ అర్బన్‌: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదని, నిర్ణీత గడువులోగా బిల్లులు చెల్లిస్తామని గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా అన్నారు. శుక్రవారం బల్దియా పరిధి 30, 49వ డివిజన్‌లో అభివృద్ధి పనుల్ని ఇంజనీర్లతో కలిసి క్షేత్రస్థాయిలో కమిషనర్‌ పరిశీలించారు. ఈసందర్భంగా రిజ్వాన్‌ బాషా మాట్లాడుతూ.. బంధం చెరువులో గణేశ్‌ నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఎఫ్‌సీఐ కాలనీ వాకింగ్‌ ట్రాక్‌ పనులు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డీఈ సంతోశ్‌బాబుని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఈ, ఇంజనీరింగ్‌ సిబ్బంది తదితరులున్నారు.

గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా

Advertisement
Advertisement