ప్రజా సమస్యలే కమ్యూనిస్టుల ఎజెండా | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలే కమ్యూనిస్టుల ఎజెండా

Published Sun, Dec 24 2023 1:12 AM

వేడుకల్లో మాట్లాడుతున్న ఎల్లేష్‌  - Sakshi

కాజీపేట: ప్రజా సమస్యల పరిష్కారాన్ని ఎజెండాగా ఎంచుకొని అవిశ్రాంత పోరాటం చేస్తున్న ఘనత భారత కమ్యునిస్టు పార్టీ (సీపీఐ)కే దక్కుతుందని హనుమకొండ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్‌ అన్నారు. కాజీపేట పట్టణంలోని ఆరుట్ల రాంచంద్రారెడ్డి (ఏఆర్‌ఆర్‌ నగర్‌) కాలనీలో సీపీఐ 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఎర్రజెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లే నేటికీ దేశం పేదరికంలో మగ్గుతూ, యువత నిరుద్యోగ సమస్యతో కాలం వెల్లదీస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాసమల్ల దీనా, శంకర్‌ నాయక్‌, ఎర్ర జయ, అనసూర్య, బండ్లు రాజమణి పాల్గొన్నారు.

బీజేపీకి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి

మడికొండ: అదానీ, అంబానీలకు ఆస్తులను కట్టబెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్‌ సూచించారు. పార్టీ 99వ వార్షికోత్సవం సందర్భంగా మడికొండలోని రావి నారాయణరెడ్డి కాలనీలో శనివారం పార్టీ జెండాను ఆవిష్కరించారు.

Advertisement
Advertisement