ఉద్యోగాలు సాధించడం హర్షణీయం | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు సాధించడం హర్షణీయం

Published Fri, Feb 16 2024 1:02 AM

-

అదనపు కలెక్టర్‌ అశ్వినితానాజీ

కరీమాబాద్‌ : వరంగల్‌ జిల్లాలోని సంక్షేమ గురుకులాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం హర్షణీయమని అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాకడే అన్నారు. జిల్లాలోని ట్రైబల్‌ వెల్ఫేర్‌, సోషల్‌ వెల్ఫేర్‌, బీసీ వెల్ఫేర్‌ గురుకులాల్లో ఉద్యోగాలు సాధించిన 42 మంది ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు అందుకునేందుకు గురువారం కలెక్టరేట్‌ నుంచి ప్రత్యేక బస్సులో హైదరాబాద్‌కు వెళ్లారు. బస్సును అదనపు కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, బీసీ, గిరిజన, సోషల్‌ వెల్ఫేర్‌ అధికారులు మనోహర్‌రెడ్డి, మల్లయ్య, సతీష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement