ప్రతీ ఓటరును కలిసి ప్రచారం చేద్దాం | Sakshi
Sakshi News home page

ప్రతీ ఓటరును కలిసి ప్రచారం చేద్దాం

Published Tue, Apr 9 2024 1:00 AM

సమావేశంలో మాట్లాడుతున్న 
బీజేపీ వరంగల్‌ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌ - Sakshi

బీజేపీ వరంగల్‌ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్‌

హన్మకొండ : పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతీ ఓటరును కలిసి ప్రచారం చేద్దామని బీజేపీ వరంగల్‌ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌ పిలుపునిచ్చారు. హనుమకొండలోని ఓ హోటల్‌లో సోమవారం జరిగిన బీజేపీ పార్లమెంట్‌ నియోజకవర్గస్థాయి కోర్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధిని ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రస్తుతం బీజేపీకి అనుకూలంగా ఉన్న పరిస్థితులను ఓటు రూపంలోకి మలుచుకునేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఎన్డీఏ గెలిచే 400 లోక్‌సభ స్థానాల్లో వరంగల్‌ ఉండేలా దూసుకుపోదామని పిలుపునిచ్చారు. తన నుంచి అందరికి సంపూర్ణ సహకారం ఉంటుందని, సమన్వయంతో పనిచేద్దామన్నారు. వరంగల్‌ ప్రజలు ఈసారి బీజేపీని గెలిపించాలని కోరారు. బీజేపీ వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ తాళ్లపల్లి కుమారస్వామిగౌడ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వి.మురళీధర్‌గౌడ్‌, క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు గంట రవి కుమార్‌, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఏడునుతుల నిషిధర్‌రెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షుడు అరుట్ల దశమంతరెడ్డి, మాజీ మంత్రి డాక్టర్‌ విజయరామారావు, నగర మాజీ మేయర్‌ టి.రాజేశ్వర్‌రావు, నాయకులు చాడ శ్రీనివాస్‌రెడ్డి, ఎరబ్రెల్లి ప్రదీప్‌రావు, డాక్టర్‌ కాళీప్రసాదరావు, లేగా రామ్మోహన్‌రెడ్డి, లింగంపల్లి ప్రసాద్‌రావు, యుగేంధర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement