పోకర్ణ స్టోన్స్‌ అధినేత ఇంటి ఎదుట బైఠాయించిన రైతులు | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 7 2023 4:02 AM

రైతులకు మద్దతు పలుకుతున్న రేణుకా చౌదరి  - Sakshi

బంజారాహిల్స్‌: మేడ్చల్‌ జిల్లా రాజబొల్లారం గ్రామంలో పోకర్ణ స్టోన్స్‌ యజమాని గౌతంచంద్‌ జైన్‌ పేద రైతుల స్థలాలను ఆక్రమించి చుట్టూ ప్రహరీ నిర్మించడమే కాకుండా వారు సొంత పొలాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ మాజీ వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ బక్కా జడ్సన్‌ ఆధ్వర్యంలో సోమవారం బాధిత రైతులు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–11లోని గౌతంచంద్‌జైన్‌ ఇంటి ఎదుట బైఠాయించారు. భారతమ్మ, వెంకటేశంగౌడ్‌ తదితర రైతులు పది మంది బాధితులు ఇంటి ఎదుట బైఠాయించి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు అక్కడికి చేరుకొని వారిని స్టేషన్‌కు తరలించారు. తమ భూములు ఆక్రమించిన గౌతంచంద్‌పై అక్కడి పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని, తిరిగి తమనే అరెస్ట్‌ చేస్తారా అంటూ బాధితులు నిలదీశారు. దీంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే సమయంలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి బాధితులకు అండగా నిలబడి వారిని విడిపించుకొని తీసుకెళ్లారు.

మద్దతు తెలిపిన కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి

Advertisement
Advertisement