లంగర్హౌస్: నగరంతో పాటు మహారాష్ట్రకు గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, లంగర్హౌస్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారి నుంచి 200 కేజీల గంజాయితో పాటు డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా, మోరంపుడి గ్రామానికి చెందిన డీసీఎం డ్రైవర్ శ్రీనివాస్ వద్ద రాజమండ్రికి చెందిన సత్తిబాబు క్లీనర్గా పనిచేస్తున్నాడు. రాజేంద్రనగర్లో ఉంటూ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్న మహమ్మద్ హబీబ్, ఏపీ, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన పలువురు ముఠాగా ఏర్పడి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. ఇందుకుగాను వీరు డీసీఎం క్యాబిన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో గంజాయి దాచి తెలంగాణ, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీలేరుకు చెందిన పాండు, నగేష్ డీసీఎం డ్రైవర్ శ్రీనివాస్ను కలిసి హైదరాబాద్కు గంజాయి సరఫరా చేస్తే రూ.1.20 లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నాడు. సరుకును నగరానికి తీసుకువచ్చి అక్కడి నుంచి మహారాష్ట్రకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ డీసీపీ చక్రవర్తి గుమ్మి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ రాజేష్, ఎస్సై శాంతికుమార్ దాడిచేసి శ్రీనివాస్, సత్తిబాబుతో పాటు నగరానికి చెందిన హబీబ్ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 200 కేజీల గంజాయి, డీసీఎం వాహనం, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని లంగర్హౌస్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నగరానికి చెందిన పర్వేజ్, జావిద్, మహారాష్ట్రకు చెందిన మంగేష్, ఏపీకి చెందిన నగేష్, పాండు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
భారీగా గంజాయి పట్టివేత
Published Mon, Mar 20 2023 4:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
అక్రమ కేసులు పెడుతున్నారు..
మూడు నియోజకవర్గాలకు అదనపు ఈవీఎంలు
బడి.. దందా!
పలుచోట్ల వడగళ్లు
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
‘దోస్త్’ సహాయ కేంద్రం ప్రారంభం
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మెరుగైన వైద్య సేవలందించాలి●
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement