యువతి హత్య : చాన్‌తో వివాహేతర సంబంధమే కారణమా? | Sakshi
Sakshi News home page

యువతి హత్య : చాన్‌తో వివాహేతర సంబంధమే కారణమా?

Published Mon, Apr 10 2023 7:27 AM

- - Sakshi

మేడ్చల్‌ రూరల్‌: ఓ మహిళ దారుణహత్యకు గురైన సంఘటన మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని డబీల్‌పూర్‌ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా రాష్ట్రంలోని బాద్‌బిల్లా జిల్లా కై న్‌ఫులియా గ్రామానికి చెందిన ధరిత్రి సింగ్‌ (22) మేడ్చల్‌కు వలస వచ్చి మండల పరిధిలోని ఓ రిసార్ట్‌లో పనిచేస్తూ డబిల్‌పూర్‌ గ్రామంలో నివాసం ఉంటుంది. గత కొంతకాలంగా రిసార్టులో మేనేజర్‌గా పనిచేస్తున్న చాన్‌తో పరిచయం ఏర్పడి ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. ఇటీవల ధరిత్రి గర్భం దాల్చింది.

దీంతో ప్రియుడు చాన్‌కు విషయం తెలిపి..పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. దీంతో చాన్‌ కుటుంబీకులు అభ్యంతరం వ్యక్తం చేసి గొడవకు దిగారు. చాన్‌కు అప్పటికే భార్యా పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇంట్లో ఉన్న ధరిత్రి సింగ్‌ దారుణహత్యకు గురైంది. చేతులు కట్టేసి..మెడకు టవల్‌ చుట్టి గొంతు నులిమి హత్య చేసినట్లు గుర్తించిన మేడ్చల్‌ పోలీసులు.. క్లూస్‌టీం, డాగ్‌ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. హత్యకు చాన్‌ కుటుంబీకులు కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా చాన్‌తో పాటు వారి కుటుంబీకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు కారణాలు, హంతకుల వివారలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

Advertisement
Advertisement