సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో వైద్య రంగం అభివృద్ధి | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో వైద్య రంగం అభివృద్ధి

Published Tue, May 30 2023 5:20 AM

అభినందన సభలో డీహెచ్‌ శ్రీనివాసరావును సన్మానిస్తున్న ఉద్యోగులు, అధికారులు - Sakshi

సుల్తాన్‌బజార్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీష్‌రావుల ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మారుస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు పేర్కొన్నారు. హెల్త్‌ డైరెక్టర్‌గా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టీఎన్జీఓస్‌ డీఎంహెచ్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌ఎస్‌ కార్యాలయం ప్రాంగణంలో శ్రీనివాసరావుకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశీస్సులతో తాను ముందుకు సాగుతున్నానని తెలిపారు. ఐదేళ్ల పదవీ కాలంలో రెండేళ్లు కోవిడ్‌ కష్టకాలం ఎదురైందని, అయినా వెరవకుండా మెరుగైన చికిత్సలు, ఎంతోమందికి వ్యాక్సిన్లు అందజేసిన చరిత్ర తెలంగాణ ప్రభుత్వానికి ఉందన్నారు. కోవిడ్‌ బారిన పడిన ఎంతో మంది రోగులను కాపాడిన ఘనత వైద్యశాఖకు ఉందన్నారు. వైద్యశాఖ ఉద్యోగులు తన అన్నదమ్ములని, తాను ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేస్తున్నారని ఆయన ఉద్వేగంగా అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో 9 ఏళ్ల పాటు అధికారంలో ఉంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ఎండీ పుష్ప, జాయింట్‌ డైరెక్టర్‌ సుధీర్‌, డి.డి శ్వేత మౌంటి, శేఖర్‌, శంకర్‌ టీఎన్జీఓస్‌ ఎంహెచ్‌ఎస్‌ యూనిట్‌ అధ్యక్షులు మామిడి ప్రభాకర్‌, సల్లాఉద్దీన్‌, క్రాంతి కిరణ్‌, చక్రి, ప్రభాకర్‌, కిరణ్‌రెడ్డిలతో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు.

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు

Advertisement

తప్పక చదవండి

Advertisement