అండర్‌–17 రన్నరప్‌ ప్రణవ్‌రామ్‌ | Sakshi
Sakshi News home page

అండర్‌–17 రన్నరప్‌ ప్రణవ్‌రామ్‌

Published Wed, Sep 20 2023 6:02 AM

- - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యోనెక్స్‌–సన్‌రైజ్‌ జాతీయ సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ అండర్‌–17 బాలుర విభాగంలో మిజోరంకు చెందిన లల్‌తజువల విజేతగా నిలిచాడు. మంగళవారం జరిగిన ఫైనల్లో లల్‌తజువల 21–11, 21–15 స్కోరుతో తెలంగాణకు చెందిన ఎన్‌.ప్రణవ్‌రామ్‌పై విజయం సాధించాడు. అండర్‌–17 బాలికల విభాగంలో హరియాణాకు చెందిన అన్‌మోల్‌ ఖర్బ్‌ టైటిల్‌ గెలుచుకుంది. ఫైనల్లో అన్‌మోల్‌ 21–14, 21–19తో పంజాబ్‌కు చెందిన తాన్వి శర్మను ఓడించింది. మొయినాబాద్‌లోని గుత్తా జ్వాల బ్యాడ్మింటన్‌ అకాడమీ వేదికగా ఈ టోర్నీ జరిగింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ విజేతలకు బహుమతులు అందజేశారు.

ఇతర విజేతలు: (అండర్‌–15 విభాగం) సింగిల్స్‌– బాలురు: నిశ్చల్‌చంద్‌ (ఉత్తరాఖండ్‌), బాలికలు: ఆదర్శినిశ్రీ (తమిళనాడు); డబుల్స్‌– బాలురు: హార్దిక్‌ దివ్యాంశ్‌–అమిత్‌రాజ్‌ (కర్నాటక), బాలికలు: అదితి దీపక్‌రాజ్‌–బి.పొన్నమ్మ (కర్నాటక); మిక్స్‌డ్‌ డబుల్స్‌: ఆకాశ్‌ చంగ్‌మై–శాంతిప్రియ (అసోం); (అండర్‌–17 విభాగం) డబుల్స్‌– బాలురు: భార్గవ్‌రామ్‌–విశ్వతేజ్‌ (ఆంధ్రప్రదేశ్‌), బాలికలు: తాన్వి రెడ్డి (తెలంగాణ)–రేషిక (తమిళనాడు); మిక్స్‌డ్‌ డబుల్స్‌: భార్గవ్‌రామ్‌ (ఏపీ)–ప్రగతి పరీదా (ఒడిషా).

జాతీయ సబ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌

Advertisement
Advertisement