ఆర్పీఎఫ్‌ కవాతు అదుర్స్‌ | Sakshi
Sakshi News home page

ఆర్పీఎఫ్‌ కవాతు అదుర్స్‌

Published Sun, Sep 24 2023 3:36 AM

-

రైల్వే రక్షక దళం 39వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని శనివారం మౌలాలీలోని ఆర్‌పీఎఫ్‌ శిక్షణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కేంద్ర రైల్వే, బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్‌ పాటిల్‌ దన్వే ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఆర్పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ మనోజ్‌ యాదవ్‌, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌ జైన్‌, డీజీపీ అంజనీకుమార్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 200 మందికి పైగా ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్యాండ్‌ కవాతు, పరేడ్‌ విశేషంగా ఆకట్టుకుంది. – సాక్షి, సిటీబ్యూరో

Advertisement
Advertisement