వల వేసి..దోచేసి.. | Sakshi
Sakshi News home page

వల వేసి..దోచేసి..

Published Tue, Sep 26 2023 7:36 AM

-

హిమాయత్‌నగర్‌: నగరానికి చెందిన మహిళ రెండో పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తోంది. మ్యాట్రిమోనియల్‌కు సంబంధించిన సోషల్‌ మీడియా సైట్లను ఫాలో అవుతుండేది. ఇందులో భాగంగా యూఎస్‌లో సైంటిస్ట్‌గా చేస్తున్నానంటూ ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతను ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌కు వాట్సాప్‌లో హాయ్‌ పంపిన మహిళను ప్రేమలోకి దించాడు. ఈ క్రమంలో గిఫ్ట్‌గా డాలర్స్‌ పంపుతున్నానని చెప్పాడు. ఆ తర్వాత రెండు రోజులకు ఢిల్లీ కస్టమ్స్‌ అధికారి పేరుతో ఓ వ్యక్తి ఫోన్‌ చేసి మీ పేరుపై డాలర్స్‌, ఖరీదైన గిఫ్ట్‌లు వచ్చాయని, రూ. 25 వేలు చెల్లిస్తే వాటిని మీకు అందజేస్తామన్నారు. ఇలా పలు దఫాలుగా బాధితురాలి నుంచి రూ. 5.55 లక్షలు దోచుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రెండో పెళ్లంటూ గాలం

కస్టమ్స్‌ పేరుతో లూటీ

రూ.5.55 లక్షలు స్వాహా

Advertisement
Advertisement