సాగర్‌ తీరాన మరోసారి రయ్‌ రయ్‌ | Sakshi
Sakshi News home page

సాగర్‌ తీరాన మరోసారి రయ్‌ రయ్‌

Published Sat, Oct 21 2023 4:46 AM

- - Sakshi

హైదరాబాద్: ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫార్ములా–ఈ కార్‌ రేసింగ్‌ పోటీలకు హైదరాబాద్‌ మరోసారి వేదిక కానుంది. హుస్సేన్‌సాగర్‌ తీరంలో సుమారు 2.8 కిలోమీటర్ల నెక్లెస్‌రోడ్డు మార్గంలో ఎలక్ట్రిక్‌ కార్లు రయ్‌రయ్‌మంటూ పరుగులు తీయనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ఈ పోటీలను నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి జూలై వరకు పలు అంతర్జాతీయ నగరాల్లో జరగనున్న ఫార్ములా–ఈ పోటీలకు సంబంధించిన సీజన్‌–10 కేలండర్‌ను హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అర్వింద్‌కుమార్‌ ‘ఎక్స్‌’ ద్వారా ట్వీట్‌ చేశారు.

మరోవైపు పోటీలకు ముందు జరగనున్న ఇండియన్‌ కార్‌ రేసింగ్‌ పోటీలను నవంబర్‌లో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. నవంబర్‌ 10, 11 తేదీల్లో ఈ పోటీలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కార్‌ రేసింగ్‌ పోటీలకు అన్నివిధాలుగా ట్రాక్‌ సిద్ధంగా ఉందని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. ట్రాక్‌ మార్గంలో బారికేడ్లు వంటివి ఏర్పాటు చేసి త్వరలోనే పున రుద్ధరించనున్నట్లు పేర్కొన్నారు. ఐమాక్స్‌తో పాటు ట్రాక్‌ మార్గంలో ప్రేక్షకుల కోసం ప్రత్యేక గ్యాలరీలను, స్క్రీన్‌లను ఏర్పాటు చేయనున్నారు.

Advertisement
Advertisement