సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వర్షం కురిసింది. మంగళవారం రాత్రి ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావారణం మారిపోయింది. మేఘాలు కమ్ముకుపోయాయి. చిరు జల్లుతో ప్రారంభమైన వర్షం పలు ప్రాంతాల్లో దంచి కొట్టింది. లింగంపల్లిలో అత్యధికంగా 4 సెంటీమీటర్ల వర్ష కురిసింది. చందానగర్లో 3.4 సెంటీమీటర్లు, మూసాపేటలో 2.6, గచ్చిబౌలిలో 2.4, ఆర్సీపురంలో 2 సెంటీ మీటర్ల వర్షపాతం కురిసింది. మాదాపూర్, బోరబండ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట, యూసఫ్గూడ, మాదాపూర్, హైటెక్ సిటీ, మియాపూర్, కుత్బుల్లాపూర్, సూరారం, సుచిత్ర, కొంపల్లి, చింతల్, షాపూర్ ఏరియాల్లో వర్షం కురిసింది.
లింగంపల్లిలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు