మోసపోయి బల్దియాకు ఫిర్యాదు చేశా | Sakshi
Sakshi News home page

మోసపోయి బల్దియాకు ఫిర్యాదు చేశా

Published Wed, Nov 22 2023 4:34 AM

-

సాక్షి, సిటీబ్యూరో: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ ప్రాంతంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కేటాయించినట్లు తయారైన నకిలీ సర్టిఫికెట్ల స్కామ్‌లో తాను మోసపోయానని షేక్‌పేటలోని వినో బానగర్‌ వాసి జేబా రెహ్మాన్‌ అలియాస్‌ ముంతాజ్‌ తెలిపారు. మోసగాళ్ళ మాటలు నమ్మి భారీ మొత్తం నష్టపోవడంతో పాటు దీనిపై జీహెచ్‌ఎంసీ అధికారులకూ ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించిన వివరాలు సేకరించడానికి తనను ఏ అధికారి సంప్రదించలేదని ఆమె స్పష్టం చేశారు.

‘డబుల్‌’ బాధితురాలు జేబా రెహ్మాన్‌

Advertisement
Advertisement