వైభవంగా యాదాద్రీశుడి కల్యాణోత్సవం | Sakshi
Sakshi News home page

వైభవంగా యాదాద్రీశుడి కల్యాణోత్సవం

Published Sat, Nov 25 2023 4:44 AM

- - Sakshi

కవాడిగూడ: ఎన్‌టీఆర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం శుక్రవారంతో 11వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ స్వామి కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ పరిపూర్ణానందగిరి స్వామీజీ (వ్యాసాశ్రమం, ఏర్పేడు), శ్రీ రథదర రామానుజ జీయర్‌ స్వామీజీ (జగన్నాథ మఠం హైదరాబాద్‌) అనుగ్రహ భాషణం వినిపించగా, గరికపాటి నర్సింహారావు ప్రవచనాలు విన్పించారు. ప్రధాన వేదికపై కొల్హాపూర్‌ మహాలక్ష్మికి కోటి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం యాదాద్రి లక్ష్మీ నర్సింహ స్వామివారిని పల్లకి వాహనంపై ఊరేగించారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జె.శ్రీనివాసరావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

1/1

Advertisement
Advertisement