● ఫలించిన పోలీసు వ్యూహం | Sakshi
Sakshi News home page

● ఫలించిన పోలీసు వ్యూహం

Published Fri, Dec 1 2023 7:22 AM

- - Sakshi

నగర పోలీసుల వ్యూహం.. దాదాపు రెండు నెలలుగా తీసుకున్న చర్యలు వెరసీ.. గురువారం చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఐసీసీసీలోని కమిషనరేట్‌లో ఉన్న కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (సీసీసీ) నుంచి నగర కొత్వాల్‌ సందీప్‌ శాండిల్యతో పాటు ప్రత్యేక అబ్జర్వర్లు దీపక్‌ మిశ్రా, అజయ్‌ వి నాయక్‌ పరిస్థితుల్ని ఆధ్యంతం పర్యవేక్షించారు. నగర వ్యాప్తంగా ఉన్న, కొత్తగా ఏర్పాటు చేసిన 6 వేల సీసీ కెమెరాలను దీనికి అనుసంధాచించారు. చివరి రెండు గంటలు అయిన మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 మధ్య సమయం అత్యంత కీలకం. ఈ వేళల్లోనే దొంగ ఓట్లు ఎక్కువగా పడటం, ఘర్షణలు చోటు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసు విభాగం ఆ రెండు గంటలూ అత్యంత అప్రమత్తమైంది. రిజర్వ్‌లో ఉన్న బలగాలను సైతం ఏరియాల్లోకి పంపించి ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంది. ఫలితంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్‌ పూర్తి చేయగలిగింది.

Advertisement
Advertisement