బలం పుంజుకున్న బీజేపీ? | Sakshi
Sakshi News home page

బలం పుంజుకున్న బీజేపీ?

Published Sat, Dec 2 2023 5:06 AM

- - Sakshi

ఈ ఎన్నికల్లో అన్ని చోట్ల అభ్యర్థులను బరిలోకి దింపిన బీజేపీ.. తన ఓటు బ్యాంకును బలోపేతం చేసుకుంది. ఆశించిన వాటి కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బీఆర్‌ఎస్‌పైన ఉన్న వ్యతిరేకత కొన్ని చోట్ల బీజేపీకి అనుకూలంగా మారింది. మరోవైపు మొదటి నుంచి గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఓటర్లు కొన్ని చోట్ల బీజేపీని ఎన్నుకున్నారు. ఈ విధంగా కూడా సీట్ల సంఖ్య పెరుగుతుందని ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. మోదీ, అమిత్‌షా, నడ్డా వంటి అగ్రనేతలంతా కదన రంగంలోకి దిగడంతో బీజేపీ బలం అనూహ్యంగా పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement