బాలానగర్: ఉపాధ్యాయులు బోధించిన పాఠాలు, చెప్పిన మాటలు ఆచరించినందునే తాము అందరం మంచి స్థితిలో, పదిమందికి సహాయం చేసే స్థాయిలో ఉన్నామని తెలంగాణ రాష్ట్ర మాజీ డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. 1975లో నాగార్జున సాగర్లో ఏర్పాటైన ఏపీఆర్జేసీ తొలి బ్యాచ్ విద్యార్థులు ‘సాగర్ పరివార్’ పేరుతో ఆదివారం జేఎన్టియుహెచ్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తమ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆత్మీయంగా పలకరించుకుని కబుర్లు చెప్పుకున్నారు. అనంతరం తమకు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులను సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ నుంచి ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన నందిని అగసరను సన్మానించి రూ. 50 వేలు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. అనంతరం కొత్త కమిటీని ఎన్నుకున్నారు. గతం అధ్యక్ష, కార్యదర్శులే మళ్లీ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో డా. కె. వెంకటేశం. మహారాష్ట్ర మాజీ డీజీపీలతో పాటు 400 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.