నాగోలు: అనుమానాస్పద స్థితిలో భవనం పైనుంచి కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు ఎల్బీనగర్, ఆర్టీసీకాలనీకి చెందిన వెంకటకుమార్(41), కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
మంగళవారం అతడి ఇంటికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వెంకటకుమార్ను బయటికి తీసుకెళ్లి రాత్రి వదిలేసి వెళ్లారు. బుధవారం మరో ముగ్గురు వ్యక్తులు అతడి ఇంటికి వచ్చి తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని భవనం మూడో అంతస్తుకు తీసుకెళ్లి అతనిపై మరోసారి దాడి చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన అతడి భార్య అనిత వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమైపె కూడా దాడికి యత్నించారు.
వారు వెళ్లిన కొద్దిసేపటికే వెంకటకుమార్ భవనం పైనుంచి కింద పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు., అనిత ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తన భర్తను డబ్బుల విషయమై నవీన్, మరి కొందరు దాడి చేసి భవనంపై నుంచి తోసి హత్య చేశారని ఆమె ఆరోపించింది.