నడుస్తున్న కారులో మంటలు | Sakshi
Sakshi News home page

నడుస్తున్న కారులో మంటలు

Published Thu, Feb 15 2024 7:08 AM

- - Sakshi

పంజగుట్ట: నడుస్తున్న కారులో నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో నిత్యం ఎంతో రద్దీగా ఉండే పంజగుట్ట సర్కిల్‌ వద్ద వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. మల్లేపల్లికి చెందిన సికిందర్‌ అనే వ్యక్తి బుధవారం రిడ్జ్‌ కారులో ఎర్రమంజిల్‌ నుండి పంజగుట్ట వైపునకు వెళుతుండగా పంజగుట్ట సమీపంలోని స్వయంవర్‌ బట్టల దుకాణం వద్దకు రాగానే కారు ఇంజిన్‌లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్‌ కారు దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు. స్థానిక వ్యాపారులు మంటలు ఆర్పేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే కారు ఇంజిన్‌, లోపల ముందు, వెనక సీట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పోలీసులు మంటలు ఆర్పి కారును స్టేషన్‌కు తరలించారు. ఈ కారణంగా కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Advertisement
Advertisement