గోల్కొండ ఆసుపత్రిలో కార్పొరేట్‌ వైద్య సేవలు | Sakshi
Sakshi News home page

గోల్కొండ ఆసుపత్రిలో కార్పొరేట్‌ వైద్య సేవలు

Published Wed, Mar 6 2024 7:50 AM

వైద్యులతో సమావేశమైన 
డాక్టర్‌ మహ్మద్‌ మజహర్‌ ఉల్లా  - Sakshi

గోల్కండ: గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో అన్ని విభాగాల వైద్యులు ఉన్నారని ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహ్మద్‌ మజహర్‌ఉల్లా అన్నారు. మంగళవారం వివిధ విభాగాల వైద్యులతో ఆయన సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ఆసుపత్రి కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలందిస్తుందన్నారు. ఈఎన్‌టీ విభాగంతో పాటు డెంటల్‌ విభాగంలో కూడా అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారన్నారు. ఆసుపత్రిలో ఉన్న ఐసీయూ విభాగంలో అన్ని రకాల వైద్య సేవలు, పరికరాలు ఉన్నాయని పేర్కొన్నారు. కంటి విభాగం కూడా వైద్యులు ఉన్నారని ఆయన తెలిపారు. ఫిజీషియేన్‌లతో పాటు గైనకాలజిస్టు సేవాలు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే కౌసర్‌ కృషి చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఆర్‌ఎంవో డాక్టర్‌ వినయాక్‌రావు, ఏవో డాక్టర్‌ శ్రీనివాస్‌రావు, క్రిటికల్‌ కేర్‌ ఎమర్‌జెన్సీ డాక్టర్‌ అమీనా, ఫెథలాజిస్ట్‌ డాక్టర్‌ జబీన్‌, డెర్మటాలజిస్ట్‌ డాక్టర్‌ సుహసిని, పిడియాట్రిక్‌ విభాగం డాక్టర్‌ మల్లికార్జున్‌, ఈన్‌టీ విభాగం డాక్టర్‌ రమ్య తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement