Pak Minister Bilawal Bhutto Said Visit Should Not Be Seen That Terms, Details Inside - Sakshi
Sakshi News home page

'దీన్ని అలా చూడకూడదు..': భారత్‌ పర్యటనపై పాక్‌ మంత్రి వ్యాఖ్యలు

Published Fri, Apr 21 2023 3:21 PM

Pak Minister Bilawal Bhutto Said Visit Should Not Be Seen That Terms - Sakshi

భారత్‌లోని గోవాలో వచ్చే నెల మే 4 నుంచి 5 వరకు షాంఘై కో ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ కౌన్సిల్‌(ఎస్సీఓ) సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఆ సమావేశానికి బిలావల్‌ భుట్టో జర్దారీ పాక్‌ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారని పాక్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది. ఈ మేరకు జర్దారీ పాక్‌ స్థానిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ..వచ్చే నెలలో గోవాలో జరిగే విదేశాంగ మంత్రుల సమావేశంలో తాను పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు.

తాము ఎస్సీఓ చార్టర్‌కు కట్టుబడి ఉన్నాం అని చెప్పారు. తాను ఈ సమావేశంలో పాలుపంచుకోవడం అనేది SCO చార్టర్‌ పట్ల పాక్‌కు ఉన్న నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తోందన్నారు. ఈ పర్యటనను ద్వైపాక్షిక సంబంధాల కోణంలో చూడకూడదని జర్దారీ అన్నారు. కాగా, దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత భారత్‌లో పర్యటించనున్న తొలి విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో. చివరిసారిగా 2011లో అప్పటి పాక్‌ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌ భారత్‌లో పర్యటించారు. భారత్‌లో జరగనున్న విదేశాంగ మత్రుల సమావేశానికి పాక్‌, చైనాతో సహా షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సభ్యులందరికీ భారత్‌ అధికారికంగా ఆహ్వానాలు పంపింది.

ఈ సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి క్విన్‌ గ్యాంగ్‌, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ కూడా పాల్గొనే అవకాశం ఉంది. గతేడాది సెప్టంబర్‌లో తొమ్మిది మంది సభ్యులతో కూడిన మెగా గ్రూపింగ్‌కు భారతదేశం ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించగా, ఈ ఏడాది కీలక మంత్రి వర్గ సమావేశాలు, శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించనుంది. ఈ 20  ఏళ్ల షాంఘై సహకార సంస్థలో రష్యా, ఇండియా, చైనా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్‌, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాలు సభ్యులుగా ఉన్నాయి.

ఇందులో ఇరాన్‌ ఇటీవలే తాజగా సభ్యత్వం పొందిన దేశం. పైగా తొలిసారిగా ఇరాన్‌ బారత్‌ సారథ్యంలో పూర్తిస్థాయి సభ్యునిగా గ్రూపింగ్‌ సమావేశానికి హాజరవుతోంది. ఇక షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్‌ 2022లో ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగింది.  దీనికి నరేంద్ర మోదీ హజరయ్యారు. అంతేగాదు జూన్‌ 2019 కిర్గిజిస్థాన్‌లో షాంఘై సదస్సు తదనంతరం జరిగి తొలి వ్యక్తిగత శిఖరాగ్ర సదస్సు కూడా ఇదే. 

(చదవండి:  ఇద్దరి అధికారహం, అంతర్యుద్ధం.. సామాన్యుల ఆకలి కేకలు)

Advertisement
Advertisement