Sakshi News home page

ఇరాన్‌, పాకిస్తాన్‌ మధ్య మళ్లీ హై టెన్షన్‌ !

Published Sat, Feb 24 2024 8:21 AM

Tensions Again Escalating Between Iran Pakistan - Sakshi

టెహ్రాన్‌: ఇరాన్‌,పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. జైష్‌ అల్‌ అదిల్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్‌ మిలిటెంట్‌ కమాండర్‌తో పాటు అతడి అనుచరులపై పాకిస్తాన్‌ భూ భాగంలో ఇరాన్‌ ఆర్మీ దాడిచేసి హతమార్చింది. ఈ విషయాన్ని ఇరాన్‌ అధికారిక మీడియా వెల్లడించింది. దక్షిణ ఇరాన్‌లోని సిస్తాన్‌ బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌ కేంద్రంగా 2012లో జైష్‌ అల్‌ అదిల్‌ కార్యకలాపాలు మొదలయ్యాయి.

కొన్నేళ్ల తర్వాత ఈ సంస్థ ఉగ్రవాదులు ఇరాన్‌ భద్రతాబలగాలపైనే దాడులు చేయడం ప్రారంభించారు. గతేడాది డిసెంబర్‌లో సిస్తాన్‌ బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌పై జరిగిన దాడిలో 11  మంది పోలీసులు చనిపోయారు. ఈ దాడి చేసింది తామేనని జైష్‌ అల్‌ అదిల్‌ ప్రకటించుకుంది. గత నెలలో పరస్పరం మిసైల్‌ దాడులకు దిగడంతో ఇరాన్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.  

ఈ దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య భద్రతా సహకారం విషయమై ఒప్పందం కూడా జరిగింది. ఈ విషయమై రెండు దేశాల విదేశాంగ మంత్రులు సంయుక్త మీడియా సమావేశం కూడా నిర్వహించారు. వెనక్కి పిలిచిన ఇరు దేశాల రాయబారులను తిరిగి వారి స్థానాల్లో నియమించారు. ఈ నేపథ్యంలో జైష్‌ అల్‌ అదిల్‌ టెర్రరిస్టులపై పాకిస్తాన్‌ భూభాగంలో ఇరాన్‌ బలగాల దాడి మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీసింది.

ఇదీ చదవండి.. రష్యాపై భారీ ఆంక్షలు

Advertisement
Advertisement