రెండో ఏఎన్‌ఎంల భిక్షాటన | Sakshi
Sakshi News home page

రెండో ఏఎన్‌ఎంల భిక్షాటన

Published Sun, Aug 27 2023 1:40 AM

భిక్షాటన చేస్తున్న రెండవ ఏఎన్‌ఎంలు. - Sakshi

జగిత్యాలటౌన్‌: తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని రెండో ఏఎన్‌ఎంల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాండ్ల మధురిమ కోరారు. సమ్మెలో భాగంగా శనివారం భిక్షాటనతో నిరసన వ్యక్తం చేశా రు. స్థానిక తహసీల్‌ చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమంలో మధురిమ మాట్లాడుతూ తమ యూనియన్‌ నాయకులతో రెండు దఫాలుగా చర్చలు జరిపిన ప్రభుత్వం.. రెగ్యులరైజేషన్‌ తప్ప మిగతా సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. అయితే, రెగ్యులరైజేషన్‌ తప్ప మరో ఆప్షన్‌ అవస రం లేదని తిరస్కరించామని తెలిపారు. మిగతా శాఖల్లో మాదిరిగానే తమ గోడు పట్టించుకోవాలని కోరారు. తెలంగాణ ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న మేము మీ బిడ్డలం కాదా అని ప్రశ్నించారు. సెప్టెంబర్‌ 16వరకు సమ్మె కొనసాగించేందుకు యూని యన్లు నిర్ణయించాయని, ఈలోగా ప్రభుత్వం దిగి రాకుంటే ఆందోళనను మరింతి ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గూడూరి జయప్రద, మమత, సుప్రియ, నీరజ, పద్మ, రాజ మని, మేరి, ఎలిజబెత్‌, శిరీష, ప్రశాంతి, శైలజ, సునీత, అహల్య, షాలిమున్నీసా, శిరీష పాల్గొన్నారు.

Advertisement
Advertisement