‘ప్రజలే నా బలం బలగం’ | Sakshi
Sakshi News home page

‘ప్రజలే నా బలం బలగం’

Published Mon, Dec 4 2023 1:52 AM

- - Sakshi

ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌

ధర్మపురి: ఎన్నికల్లో గెలిపించిన నియోజకవర్గ ప్రజలే తన బలం.. బలగమని, శ్వాస ఉన్నంతవరకూ ప్రజల వెంట ఉంటానని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. ఆయన గెలిచిన సందర్భంగా ధర్మపురిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నుంచి ప్రజలు ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. నాయకులు వేముల రాజేశ్‌, కౌన్సిలర్లు వేముల నాగలక్ష్మి, అరుణ, పద్మ, నాయకులు సుముక్‌, సింహరాజు ప్రసాద్‌, బలిపెల్లి లింగన్న, సీపతి సత్యనారాయణ, నాయకులు ఉన్నారు.

Advertisement
Advertisement