చెట్టును ఢీకొని యువకుడి దుర్మరణం | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొని యువకుడి దుర్మరణం

Published Sat, Dec 9 2023 4:44 AM

 పర్శరాములు(ఫైల్‌)
 - Sakshi

ముస్తాబాద్‌(సిరిసిల్ల): మండలంలోని ఆవునూర్‌ శివారులో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలు. ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం గ్రామానికి చెందిన కూ రాకుల ఎల్లవ్వ, దేవరాజు దంపతుల కుమారుడు పర్శరాములు(27) గురువారం రాత్రి గూడెంలోని రైస్‌మిల్లుకు బైక్‌పై వచ్చాడు. మిల్లులో తౌడు తీసుకుని తిరుగు ప్రయాణంలో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో పర్శరాములు రోడ్డు కింద పడిపోయాడు. రాత్రయినా కొడుకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఎంత వెతి కిన పర్శరాములు కనిపించలేదు. శుక్రవారం ఉద యం గ్రామస్తులు గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పర్శరాములు నాలుగేళ్లు దుబాయ్‌కు వెళ్లి ఇటీవల వచ్చాడు. వెంకటాపూర్‌లో వెల్డింగ్‌ పనులు చేస్తుండేవాడు. పర్శరాములు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతుడి తండ్రి దేవరాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement