నాలుగు ఇళ్లల్లో చోరీ | Sakshi
Sakshi News home page

నాలుగు ఇళ్లల్లో చోరీ

Published Sun, Dec 17 2023 10:30 AM

వివరాలు సేకరిస్తున్న క్లూస్‌టీం - Sakshi

మల్లాపూర్‌: మండలకేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు నాలుగిళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. నాలుగుతులాల బంగారం, రెండు కిలోల వెండిని దొంగిలించారు. బాధితులు, మెట్‌పల్లి సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై నవీన్‌కుమార్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బురం అరవింద్‌, మాతే విమల, రమ్యశ్రీ, చింతకుంట రేవతి ఇళ్లకు తాళం వేసి వెళ్లారు. గుర్తు తెలియని దుండగులు వారి ఇళ్లలో చోరబడ్డారు. బాధిత కుటుంబాలు ఉదయం వచ్చి చూసే సరికి వస్తువులు, బట్టలు చిందరవందరగా పడి ఉన్నాయి. ఆభరణాలు, వెండి వస్తువులు కనిపించకపోవడంతో దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ, ఎస్సై పోలీస్‌ సిబ్బందితో క్లూస్‌టీంతో వచ్చి విచారణ చేపట్టారు. బాధితల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేయనున్నట్లు సీఐ తెలిపారు.

నాలుగు తులాల బంగారం, రెండు కిలోల వెండి అపహరణ

Advertisement
Advertisement