జగిత్యాల: మండలంలోని మల్లన్నపేట మల్లికార్జున స్వామిని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి దర్శించుకున్నారు. అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మల్లన్నకు పూజలు చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎత్తు బంగారం ఇచ్చారు. గ్రంథాలయ మాజీ చైర్మన్ కటారి చంద్రశేఖర్ రావు, సర్పంచ్లు సిద్దంకి నర్సయ్య, నిశాంత్ రెడ్డి, చిర్ర గంగాధర్, రాజ్యలక్ష్మి తిరుపతి రెడ్డి, వెంకటపద్మ, మాజీ సర్పంచ్ బీమ సంతోష్, నేరెల్ల మహేశ్, బుచ్చిరెడ్డి, గంగాధర్, ఉమేశ్ పాల్గొన్నారు.
Breadcrumb
- HOME
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎత్తు బంగారం!
Published Mon, Jan 1 2024 2:14 AM
Related news
-
ఇందూరు నిర్ణేతలు వీరే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వ్యవసాయపరంగా అభివృద్ధిపథంలో దూసుకెళుతూ...రైతు ఉద్యమాల కేంద్రంగా ఉన్న ఇందూరులో గత కొన్నేళ్లుగా ఎన్నికల్లో ప్రజలు విలక్షణ తీర్పు ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో తీర్పును ప్రభావితం చేసే అంశాలు ప్రధాన పార్టీలకు గుబులు పుట్టిస్తున్నాయి. బీజేపీ నుంచి నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత తాటిపర్తి జీవన్రెడ్డి, బీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నారు.త్రిముఖ పోటీగా భావిస్తున్నప్పటికీ రెండు జాతీయ పార్టీల మధ్యే హోరాహోరీ పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 1952 నుంచి 2019 వరకు నిజామాబాద్ లోక్సభ స్థానానికి 17 సార్లు ఎన్నికలు జరగగా 11 సార్లు కాంగ్రెస్, 3 సార్లు టీడీపీ, ఒకసారి స్వతంత్ర, ఒకసారి బీఆర్ఎస్, ఒకసారి బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక నిజామాబాద్ నుంచి ఇప్పటివరకు ఎవరినీ కేంద్ర మంత్రి పదవి వరించలేదు.గల్ఫ్ సంక్షేమ బోర్డు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో గల్ఫ్ వలస కార్మిక కుటుంబాల ఓట్లు 22% ఉన్నట్టు అంచనా. దీంతో ఆయా కార్మికుల కుటుంబాల ఓట్ల కోసం రెండు జాతీయ పార్టీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. గల్ఫ్ సంక్షేమ బోర్డు డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కాగా గల్ఫ్ కార్మిక సంఘాలు 60 ఉన్నాయి.ఈ సంఘాల జేఏసీకి జీవన్రెడ్డి గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో తనను తమ ప్రతినిధిగా పార్లమెంట్కు పంపాలని జీవన్రెడ్డి కోరుతున్నారు. గల్ఫ్ బోర్డు ఏర్పాటుకు సీఎం రేవంత్రెడ్డి హామీ ఇవ్వడంతో పాటు తగిన కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికులకు గౌరవం దక్కుతోందంటే బీజేపీ, మోదీ మాత్రమే కారణమని అర్వింద్ పేర్కొంటున్నారు. ♦ ఉత్తర, దక్షిణ భారతానికి మధ్యలో హబ్ మాదిరిగా ఉన్న నిజామాబాద్ ప్రాంతంలో కంటెయినర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేయాలని చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కోరుతున్నారు. డ్రైపోర్ట్ ఏర్పాటయితే ఇక్కడి నుంచే నేరుగా వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి ఎగుమతులు చేయవచ్చని అంటున్నారు. ♦ జక్రాన్పల్లి వద్ద విమానాశ్రయం ఏర్పాటు చేయాలనే డిమాండ్, బీడీ కార్మికుల అంశం సైతం ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. 185 నామినేషన్లలో 178 పసుపు రైతులవే.. 2019 ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఏకంగా 185 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో పసుపు బోర్డు డిమాండ్తో రైతులు దాఖలు చేసిన నామినేషన్లే 178 ఉండడం గమనార్హం. ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీంతో ఇక్కడ పోలింగ్ నిర్వహణకు బెంగళూరు నుంచి ప్రత్యేకంగా ఈవీఎంలు తీసుకొచ్చి ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.పసుపు బోర్డు పసుపు బోర్డు మంజూరు చేస్తున్నట్టు గత శాసనసభ ఎన్నికల ముందు ప్రధాని మోదీ ప్రకటన చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రం గెజిట్ విడుదల చేసిందని, పసుపు ధర సైతం రూ. 20 వేలకు తీసుకొచ్చినట్టు అర్వింద్ చెబుతున్నారు. ఈ ప్రాంతానికి పసుపు శుద్ధి కర్మాగారాలు, ప్రాసెసింగ్, ప్యాకింగ్ యూనిట్లు వస్తాయని ఆయన అంటున్నారు.రీసెర్చ్ సెంటర్తో రైతులకు కొత్త వంగడాలు, మరిన్ని సబ్సిడీలు అందుతాయని పేర్కొంటున్నారు. అయితే పసుపు బోర్డు కాగితాలకే పరిమితమైందని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి విమర్శలు సంధిస్తున్నారు. మొత్తానికి పసుపు బోర్డు గెజిట్ విడుదలైనా, ఈ ఎన్నికల్లోనూ ఈ అంశంపై రెండు జాతీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కులాల వారీగా చూస్తే... నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మున్నూరుకాపు, ముస్లిం, పద్మశాలి ఓట్లు గణనీయంగా ఉన్నాయి. తర్వాత ముదిరాజ్, రెడ్డి, యాదవ్, గౌడ్ల ఓట్లు చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నాయి. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు కులసంఘాలతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళల ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం ఓట్లు 16,89,957 ఉండగా, పురుషుల ఓట్లు 7,99,458, మహిళల ఓట్లు 8,90,411 ఉన్నాయి. నిజాం షుగర్స్ కీలక అంశం నిజాం షుగర్ ఫ్యాక్టరీలను అర్వింద్ తెరిపించలేకపోయారని జీవన్రెడ్డి విమర్శలు చేస్తున్నారు. తాము మాత్రం 2025లో నిజాం షుగర్స్ను తెరిపిస్తామని జీవన్రెడ్డి గట్టిగా చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రక్రియ ప్రారంభించిందన్నారు. అయితే ఎంపీ అర్వింద్ సైతం ఈసారి నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెబుతున్నారు. చెరకుతో పాటు వరి, మొక్కజొన్నల నుంచి ఇథనాల్ ఉత్పత్తి సైతం చేసే యూనిట్లు ఏర్పాటు చేస్తామంటున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆయా అభ్యర్థులకు వచ్చిన ఓట్లు.. బీజేపీ – ధర్మపురి అర్వింద్ 4,80,584 (45 శాతం) టీఆర్ఎస్ – కల్వకుంట్ల కవిత 4,09,709 (39 శాతం) కాంగ్రెస్ – మధుయాష్కీ69,240 (7 శాతం) -
నాణ్యమైన ధాన్యం కొనాలి
బుగ్గారం/సారంగాపూర్: నాణ్యమైన ధాన్యాన్ని కొనాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. బుగ్గారం మండలం యశ్వంతరావుపేట, సారంగాపూర్ మండలంలోని బట్టపల్లి పోతారం గ్రామాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని రైతులకు నీడ, నీటి సౌకర్యం కల్పించాలన్నారు. ఆయన వెంట ఫుడ్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. నంచర్లలో శ్రీరాముడి రథోత్సవంపెగడపల్లి: మండలంలోని నంచర్లలోగల శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయంలో ఐదురోజులుగా నిర్వహిస్తున్న శ్రీరామనవమి ఉత్సవాలు ముగిశాయి. సోమవారం స్వామివారి రథోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. జై శ్రీరాం జైజై శ్రీరాం..అంటూ భక్తుల నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. మండలం చుట్టుపక్క గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఎంపీపీ శోభ, ఆలయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి వెంకన్న, మంత్రి హరిగోపాల్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బీడీ టేకేదారుల కమీషన్ పెంచాలికోరుట్ల: బీడీ పరిశ్రమల్లో పనిచేస్తున్న టేకేదారులకు కమీషన్ పెంచాలని, వారి సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ టేకేదారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సుతారి రాములు కోరారు. పట్టణంలో సోమవారం టేకేదారులు సమావేశమయ్యారు. నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి బీడీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగాయని, రెండేళ్ల క్రితం చేసుకున్న ఒప్పందం గడువు కూడా ముగిసిందని, ఈ క్రమంలో వెయ్యి బీడీల కమీషన్ రూ.18 నుంచి రూ.30కి పెంచాలని కోరారు. కార్యక్రమంలో టేకేదారులు సాంబయ్య, శంకర్, రవి, నర్సయ్య, సత్తయ్య, బాబురావు, బలరాం, భూమన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీల నాయకులతో ఆర్డీవో సమావేశంకోరుట్ల: స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ఆనంద్ కుమార్ సోమవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. ఓటరు సమాచార స్లిప్పులు, పోలింగ్ స్టేషన్ల లొకేషన్ మార్పుపై వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిషన్, బీజేపీ నాయకుడు ఆర్.సాయికృష్ణ, సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఎండీ.రషీద్ఖాన్, బీఆర్ఎస్ నాయకుడు జిందం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సరిహద్దు చెక్పోస్ట్ వద్ద తనిఖీలుసారంగాపూర్: మండలంలోని కమ్మునూర్ వద్ద ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్పోస్ట్ను అదనపు ఎస్పీ (ఏఆర్) భీంరావు సోమవారం తనిఖీ చేశారు. అనుమతిపత్రాలు లేకుండా వస్తువులు, నగదు తీసుకెళ్తే సీజ్ చేసి కేసు నమోదు చేయాలని సూచించారు. ఆయన వెంట ఎస్సై గౌతంపవార్ ఉన్నారు. -
కాంగ్రెస్కు ఓటేసి గోసపడుతున్నారు
మల్యాల: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసినందుకు ఇప్పుడు ప్రజలందరూ గోసపడుతున్నారని, ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే ఆగమైతరని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. మల్యాలలో సోమవారం రాత్రి రోడ్షో చేపట్టారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అంగడి బజార్లో నిర్వహించిన కార్యక్రమంలో వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ బడి తేలే.. గుడి తేలేదని, ఐదేళ్లలో కనీసం ఐదు రూపాయలు తేలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు 23 నవోదయ పాఠశాలలు రావాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం ఒక్కటీ ఇవ్వలేదన్నారు. ఓట్ల కోసం బండి సంజయ్ వస్తే నవోదయ పాఠశాల ఎందుకు తీసుకురాలేదంటూ నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా పోటీ చేసేందుకు కరీంనగర్ ఆయనకు పునరావాసమా..? అని ప్రశ్నించారు. తనను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గారడీ మాటలు, మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతోందని, నాలుగు నెలల్లోనే రాష్ట్రప్రభుత్వంపై ప్రజలు విసుగుచెందారని తెలిపారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత హక్కుల కోసం పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక కావాలని, ఇందుకు వినోద్కుమార్ను గెలిపించుకోవాలని కోరారు. స్మార్ట్ సిటీ, ట్రిపుల్ ఐటీ తెచ్చిన ఘనత వినోద్కే దక్కిందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టాలని అన్నారు. జెడ్పీటీసీ రామ్మోహన్ రావు, మిట్టపల్లి సుదర్శన్, జనగాం శ్రీనివాస్, బోయినపల్లి మధుసూదన్రావు, సాగర్ రావు పాల్గొన్నారు. ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే ఆగమైతరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మల్యాలలో రోడ్షో -
గల్ఫ్ ట్రావెల్స్పై నిఘా కరువు
జగిత్యాలక్రైం: ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లే వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. దీనిని అదునుగా తీసుకుంటున్న కొంతమంది ట్రావెల్స్ యజ మానులు గల్ఫ్ ఏజెంట్ల అవతారం ఎత్తుతున్నారు. గల్ఫ్ పంపిస్తామంటూ పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. జిల్లా నుంచి గల్ఫ్ వెళ్లేవారి సంఖ్య రెండేళ్లుగా పెరుగుతోంది. అదేస్థాయిలో జిల్లాలో సుమారు 160 ట్రావెల్స్ అనధికారికంగా కొనసాగుతున్నాయి. సదరు ట్రావెల్స్ యజమానులు గ్రామీణులు, పట్టణ ప్రాంతాలంటూ తేడా లేకుండా ఉద్యోగాలు కల్పిస్తామని ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్నారు. జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల పట్టణాలతోపాటు 20 మండలాల్లో గల్ఫ్ ట్రావెల్స్ పేరున సుమారు 160 ట్రావెల్స్ ఉన్నాయి. వీరు వాస్తవానికి విమాన టికెట్స్ బుకింగ్ చేసేందుకే అనుమతి తీసుకుంటాయి. కానీ.. నిరుద్యోగుల అవకాశాన్ని ఆసరా చేసుకుని ఉపాధి కల్పిస్తామని చెప్పి నమ్మిస్తాయి. వారి నుంచి పాస్పోర్టులు తీసుకొని ఇంటర్వ్యూలకు హాజరుపరుస్తూ వీసా వచ్చిందని నమ్మిస్తూ అందినంతా దండుకుంటున్నాయి. అదే ట్రావెల్స్లో అనుమతులు లేకుండానే మనీ ట్రాన్స్ఫర్ కేంద్రాలు కూడా కొనసాగుతున్నాయి. నిరుద్యోగులు కూడా స్థానికంగా ఉన్న ట్రావెల్స్లకు లైసెన్స్ లేదని తెలిసినా.. వారిని నమ్మి లక్షలాది రూపాయలు చేతిలో పెట్టి మోసపోతున్నారు. 26 మందికే లైసెన్స్ జిల్లాలో గల్ఫ్ పంపించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నుంచి కేవలం 26 మంది ఏజెంట్లు మాత్రమే లైసెన్స్లు తీసుకుని ట్రావెల్స్ నిర్వహిస్తున్నారు. మరో ముగ్గురు లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మిగతా వారు అనుమతులు లేకుండానే ట్రావెల్స్, ఏజెంట్లుగా చలామణి అవుతూ నిరుద్యోగులకు వీసాల పేరుతో పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారు. లైసెన్స్ లేకున్నా ఇంటర్వ్యూలు గల్ఫ్ ఏజెంట్లు, ట్రావెల్స్ నిర్వాహకులు లైసెన్స్ ఉ న్నప్పటికీ ఎస్బీ (స్పెషల్ బ్రాంచ్) పోలీసులకు స మాచారం అందించి ఇంటర్వ్యూలు నిర్వహించాలి. కానీ వారు పోలీసులకు ఎలాంటి సమాచారం లే కుండానే ఇష్టారీతిలో జిల్లాకేంద్రంలోనే పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, ముంబయ్, చైన్నె, ఢిల్లీలో ఉన్న ట్రావెల్స్ యజమానులతో కలిసి ఈ తతంగం కొనసాగిస్తున్నారు. ని రుద్యోగులను ఇంటర్వ్యూలకు పిలిపించి అర్హత సా ధించారంటూ పాస్పోర్టులు తీసుకుంటున్నారు. అ నంతరం వారికి ఏదో ఒక వీసా అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. కొన్ని ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పత్రికల ప్రకటనలు కూడా ఇస్తూ నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరయ్యేలా వాట్సా ప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియాల్లో ట్రావెల్స్ నిర్వాహకులు విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు. వారు ప్రచారానికి వాడే ప్రచార లైసెన్స్లు మాత్రం హైదరాబాద్, ముంబయ్, బెంగళూరు లాంటి ప్రాంతాలకు చెందిన ట్రావెల్స్ల పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. యూరప్ దేశాలకూ ఇంటర్వ్యూలు లైసెన్స్ ఉన్న ట్రావెల్స్ యజమానులు గల్ఫ్ దేశాలకు మాత్రమే నిరుద్యోగ యువకులను పంపించేవారు. కానీ ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా లైసెన్స్లు ఉన్న వారు, లేని వారు నిరుద్యోగులను యూరప్ దేశాల్లో ఉద్యోగాలున్నాయని సుమారు రూ.రెండు లక్షల నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేస్తున్నారంటే అతిశయోక్తికాదు. ప్రస్తుతం పోలీసు శాఖ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉండటంతో ఇదే అదునుగా చూస్తున్న ఏజెంట్లు, ట్రావెల్స్ నిర్వాహకులు వారంరోజులుగా జోరుగా గల్ఫ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. వీసా వచ్చిందని, (మెడికల్) వైద్య పరీక్షలు పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు. జిల్లాలో విచ్చలవిడిగా అర్హత లేని ట్రావెల్స్ అనుమతులు లేకుండానే ఇంటర్వ్యూలు మెడికల్ టెస్ట్ పేరుతో వసూళ్లు నకిలీ వీసాలు అంటగట్టి మోసాలు జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల, రాయికల్ మండలం తాట్లవాయి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు సొంతూరులో ఉపాధి కరువవడంతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. వీరి అవకాశాన్ని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆసరాగా చేసుకుని రూ.లక్ష తీసుకుని ఏడాది కాలంగా విదేశాలకు పంపించకుండా మోసానికి పాల్పడ్డాడు. బీర్పూర్ మండలం కొల్వాయికి చెందిన ఇద్దరు యువకులు మంచిర్యాల జిల్లా కడెం మండలానికి చెందిన ఓ యువకుడు నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లికి చెందిన ఓ గల్ఫ్ ఏజెంట్కు యూరప్ దేశానికి వెళ్లేందుకు రూ.9 లక్షలు చెల్లించాడు. ఏడాది గడుస్తోంది. దీంతో సదరు యువకుడు పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. కఠిన చర్యలు తీసుకుంటాం జిల్లా నుంచి గల్ఫ్ వెళ్లే వారు నకిలీ ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. ఎమిగ్రేషన్ చట్టబద్ధత ఉన్నవారి నుంచే వీసాలు పొందాలి. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి గల్ఫ్ మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు చేపడతాం. బాధితులు ఫిర్యాదు చేస్తే మోసగాళ్లపై కేసులు నమోదు చేస్తాం. – సన్ప్రీత్సింగ్, ఎస్పీ -
ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్
● ఆరు గ్యారంటీలు ఎక్కడ..? ● బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి సారంగాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని, ఇప్పటివరకు ఆరు గ్యారంటీల అమలు ఎక్కడ చేసిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి అన్నారు. సోమవారం సారంగాపూర్ మండలం అర్పపల్లి, లక్ష్మీదేవిపల్లి, పెంబట్లతండాల్లో పర్యటించి స్థానిక మహిళలతో మాట్లాడారు. దేశంమొత్తం ప్రధాని మోదీ పాలన కోరుకుంటోందన్నారు. త్రిపుల్ తలాక్ రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలు కూడా ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారని తెలిపారు. ఎంపీగా ధర్మపురి అర్వింద్ గెలుపే ధ్యేయంగా కృషి చేయాలన్నారు. ఆమె వెంట పార్టీ మండల అధ్యక్షుడు వరుణ్కుమార్, బొమ్మకంటి ప్రసాద్, గంగరాజు, జమున, శేఖర్, నరేశ్ పాల్గొన్నారు.
Related News by category
-
ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్
● ఆరు గ్యారంటీలు ఎక్కడ..? ● బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి సారంగాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని, ఇప్పటివరకు ఆరు గ్యారంటీల అమలు ఎక్కడ చేసిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి అన్నారు. సోమవారం సారంగాపూర్ మండలం అర్పపల్లి, లక్ష్మీదేవిపల్లి, పెంబట్లతండాల్లో పర్యటించి స్థానిక మహిళలతో మాట్లాడారు. దేశంమొత్తం ప్రధాని మోదీ పాలన కోరుకుంటోందన్నారు. త్రిపుల్ తలాక్ రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలు కూడా ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారని తెలిపారు. ఎంపీగా ధర్మపురి అర్వింద్ గెలుపే ధ్యేయంగా కృషి చేయాలన్నారు. ఆమె వెంట పార్టీ మండల అధ్యక్షుడు వరుణ్కుమార్, బొమ్మకంటి ప్రసాద్, గంగరాజు, జమున, శేఖర్, నరేశ్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్కు ఓటేసి గోసపడుతున్నారు
మల్యాల: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసినందుకు ఇప్పుడు ప్రజలందరూ గోసపడుతున్నారని, ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే ఆగమైతరని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. మల్యాలలో సోమవారం రాత్రి రోడ్షో చేపట్టారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అంగడి బజార్లో నిర్వహించిన కార్యక్రమంలో వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ బడి తేలే.. గుడి తేలేదని, ఐదేళ్లలో కనీసం ఐదు రూపాయలు తేలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు 23 నవోదయ పాఠశాలలు రావాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం ఒక్కటీ ఇవ్వలేదన్నారు. ఓట్ల కోసం బండి సంజయ్ వస్తే నవోదయ పాఠశాల ఎందుకు తీసుకురాలేదంటూ నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా పోటీ చేసేందుకు కరీంనగర్ ఆయనకు పునరావాసమా..? అని ప్రశ్నించారు. తనను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గారడీ మాటలు, మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతోందని, నాలుగు నెలల్లోనే రాష్ట్రప్రభుత్వంపై ప్రజలు విసుగుచెందారని తెలిపారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత హక్కుల కోసం పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక కావాలని, ఇందుకు వినోద్కుమార్ను గెలిపించుకోవాలని కోరారు. స్మార్ట్ సిటీ, ట్రిపుల్ ఐటీ తెచ్చిన ఘనత వినోద్కే దక్కిందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టాలని అన్నారు. జెడ్పీటీసీ రామ్మోహన్ రావు, మిట్టపల్లి సుదర్శన్, జనగాం శ్రీనివాస్, బోయినపల్లి మధుసూదన్రావు, సాగర్ రావు పాల్గొన్నారు. ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే ఆగమైతరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మల్యాలలో రోడ్షో -
గల్ఫ్ ట్రావెల్స్పై నిఘా కరువు
జగిత్యాలక్రైం: ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లే వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. దీనిని అదునుగా తీసుకుంటున్న కొంతమంది ట్రావెల్స్ యజ మానులు గల్ఫ్ ఏజెంట్ల అవతారం ఎత్తుతున్నారు. గల్ఫ్ పంపిస్తామంటూ పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. జిల్లా నుంచి గల్ఫ్ వెళ్లేవారి సంఖ్య రెండేళ్లుగా పెరుగుతోంది. అదేస్థాయిలో జిల్లాలో సుమారు 160 ట్రావెల్స్ అనధికారికంగా కొనసాగుతున్నాయి. సదరు ట్రావెల్స్ యజమానులు గ్రామీణులు, పట్టణ ప్రాంతాలంటూ తేడా లేకుండా ఉద్యోగాలు కల్పిస్తామని ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్నారు. జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల పట్టణాలతోపాటు 20 మండలాల్లో గల్ఫ్ ట్రావెల్స్ పేరున సుమారు 160 ట్రావెల్స్ ఉన్నాయి. వీరు వాస్తవానికి విమాన టికెట్స్ బుకింగ్ చేసేందుకే అనుమతి తీసుకుంటాయి. కానీ.. నిరుద్యోగుల అవకాశాన్ని ఆసరా చేసుకుని ఉపాధి కల్పిస్తామని చెప్పి నమ్మిస్తాయి. వారి నుంచి పాస్పోర్టులు తీసుకొని ఇంటర్వ్యూలకు హాజరుపరుస్తూ వీసా వచ్చిందని నమ్మిస్తూ అందినంతా దండుకుంటున్నాయి. అదే ట్రావెల్స్లో అనుమతులు లేకుండానే మనీ ట్రాన్స్ఫర్ కేంద్రాలు కూడా కొనసాగుతున్నాయి. నిరుద్యోగులు కూడా స్థానికంగా ఉన్న ట్రావెల్స్లకు లైసెన్స్ లేదని తెలిసినా.. వారిని నమ్మి లక్షలాది రూపాయలు చేతిలో పెట్టి మోసపోతున్నారు. 26 మందికే లైసెన్స్ జిల్లాలో గల్ఫ్ పంపించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నుంచి కేవలం 26 మంది ఏజెంట్లు మాత్రమే లైసెన్స్లు తీసుకుని ట్రావెల్స్ నిర్వహిస్తున్నారు. మరో ముగ్గురు లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మిగతా వారు అనుమతులు లేకుండానే ట్రావెల్స్, ఏజెంట్లుగా చలామణి అవుతూ నిరుద్యోగులకు వీసాల పేరుతో పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారు. లైసెన్స్ లేకున్నా ఇంటర్వ్యూలు గల్ఫ్ ఏజెంట్లు, ట్రావెల్స్ నిర్వాహకులు లైసెన్స్ ఉ న్నప్పటికీ ఎస్బీ (స్పెషల్ బ్రాంచ్) పోలీసులకు స మాచారం అందించి ఇంటర్వ్యూలు నిర్వహించాలి. కానీ వారు పోలీసులకు ఎలాంటి సమాచారం లే కుండానే ఇష్టారీతిలో జిల్లాకేంద్రంలోనే పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, ముంబయ్, చైన్నె, ఢిల్లీలో ఉన్న ట్రావెల్స్ యజమానులతో కలిసి ఈ తతంగం కొనసాగిస్తున్నారు. ని రుద్యోగులను ఇంటర్వ్యూలకు పిలిపించి అర్హత సా ధించారంటూ పాస్పోర్టులు తీసుకుంటున్నారు. అ నంతరం వారికి ఏదో ఒక వీసా అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. కొన్ని ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పత్రికల ప్రకటనలు కూడా ఇస్తూ నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరయ్యేలా వాట్సా ప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియాల్లో ట్రావెల్స్ నిర్వాహకులు విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు. వారు ప్రచారానికి వాడే ప్రచార లైసెన్స్లు మాత్రం హైదరాబాద్, ముంబయ్, బెంగళూరు లాంటి ప్రాంతాలకు చెందిన ట్రావెల్స్ల పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. యూరప్ దేశాలకూ ఇంటర్వ్యూలు లైసెన్స్ ఉన్న ట్రావెల్స్ యజమానులు గల్ఫ్ దేశాలకు మాత్రమే నిరుద్యోగ యువకులను పంపించేవారు. కానీ ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా లైసెన్స్లు ఉన్న వారు, లేని వారు నిరుద్యోగులను యూరప్ దేశాల్లో ఉద్యోగాలున్నాయని సుమారు రూ.రెండు లక్షల నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేస్తున్నారంటే అతిశయోక్తికాదు. ప్రస్తుతం పోలీసు శాఖ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉండటంతో ఇదే అదునుగా చూస్తున్న ఏజెంట్లు, ట్రావెల్స్ నిర్వాహకులు వారంరోజులుగా జోరుగా గల్ఫ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. వీసా వచ్చిందని, (మెడికల్) వైద్య పరీక్షలు పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు. జిల్లాలో విచ్చలవిడిగా అర్హత లేని ట్రావెల్స్ అనుమతులు లేకుండానే ఇంటర్వ్యూలు మెడికల్ టెస్ట్ పేరుతో వసూళ్లు నకిలీ వీసాలు అంటగట్టి మోసాలు జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల, రాయికల్ మండలం తాట్లవాయి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు సొంతూరులో ఉపాధి కరువవడంతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. వీరి అవకాశాన్ని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆసరాగా చేసుకుని రూ.లక్ష తీసుకుని ఏడాది కాలంగా విదేశాలకు పంపించకుండా మోసానికి పాల్పడ్డాడు. బీర్పూర్ మండలం కొల్వాయికి చెందిన ఇద్దరు యువకులు మంచిర్యాల జిల్లా కడెం మండలానికి చెందిన ఓ యువకుడు నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లికి చెందిన ఓ గల్ఫ్ ఏజెంట్కు యూరప్ దేశానికి వెళ్లేందుకు రూ.9 లక్షలు చెల్లించాడు. ఏడాది గడుస్తోంది. దీంతో సదరు యువకుడు పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. కఠిన చర్యలు తీసుకుంటాం జిల్లా నుంచి గల్ఫ్ వెళ్లే వారు నకిలీ ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. ఎమిగ్రేషన్ చట్టబద్ధత ఉన్నవారి నుంచే వీసాలు పొందాలి. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి గల్ఫ్ మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు చేపడతాం. బాధితులు ఫిర్యాదు చేస్తే మోసగాళ్లపై కేసులు నమోదు చేస్తాం. – సన్ప్రీత్సింగ్, ఎస్పీ -
నాణ్యమైన ధాన్యం కొనాలి
బుగ్గారం/సారంగాపూర్: నాణ్యమైన ధాన్యాన్ని కొనాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. బుగ్గారం మండలం యశ్వంతరావుపేట, సారంగాపూర్ మండలంలోని బట్టపల్లి పోతారం గ్రామాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని రైతులకు నీడ, నీటి సౌకర్యం కల్పించాలన్నారు. ఆయన వెంట ఫుడ్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. నంచర్లలో శ్రీరాముడి రథోత్సవంపెగడపల్లి: మండలంలోని నంచర్లలోగల శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయంలో ఐదురోజులుగా నిర్వహిస్తున్న శ్రీరామనవమి ఉత్సవాలు ముగిశాయి. సోమవారం స్వామివారి రథోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. జై శ్రీరాం జైజై శ్రీరాం..అంటూ భక్తుల నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. మండలం చుట్టుపక్క గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఎంపీపీ శోభ, ఆలయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి వెంకన్న, మంత్రి హరిగోపాల్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బీడీ టేకేదారుల కమీషన్ పెంచాలికోరుట్ల: బీడీ పరిశ్రమల్లో పనిచేస్తున్న టేకేదారులకు కమీషన్ పెంచాలని, వారి సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ టేకేదారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సుతారి రాములు కోరారు. పట్టణంలో సోమవారం టేకేదారులు సమావేశమయ్యారు. నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి బీడీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగాయని, రెండేళ్ల క్రితం చేసుకున్న ఒప్పందం గడువు కూడా ముగిసిందని, ఈ క్రమంలో వెయ్యి బీడీల కమీషన్ రూ.18 నుంచి రూ.30కి పెంచాలని కోరారు. కార్యక్రమంలో టేకేదారులు సాంబయ్య, శంకర్, రవి, నర్సయ్య, సత్తయ్య, బాబురావు, బలరాం, భూమన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీల నాయకులతో ఆర్డీవో సమావేశంకోరుట్ల: స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ఆనంద్ కుమార్ సోమవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. ఓటరు సమాచార స్లిప్పులు, పోలింగ్ స్టేషన్ల లొకేషన్ మార్పుపై వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిషన్, బీజేపీ నాయకుడు ఆర్.సాయికృష్ణ, సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఎండీ.రషీద్ఖాన్, బీఆర్ఎస్ నాయకుడు జిందం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సరిహద్దు చెక్పోస్ట్ వద్ద తనిఖీలుసారంగాపూర్: మండలంలోని కమ్మునూర్ వద్ద ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్పోస్ట్ను అదనపు ఎస్పీ (ఏఆర్) భీంరావు సోమవారం తనిఖీ చేశారు. అనుమతిపత్రాలు లేకుండా వస్తువులు, నగదు తీసుకెళ్తే సీజ్ చేసి కేసు నమోదు చేయాలని సూచించారు. ఆయన వెంట ఎస్సై గౌతంపవార్ ఉన్నారు. -
నిజామాబాద్ లోక్సభకు 12 నామినేషన్లు
ఖలీల్వాడి: నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సోమవారం 12 నామినేషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్, బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థిగా దేవతి శ్రీనివాస్ మూడోసెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి కండెల సుమన్, స్వతంత్ర అభ్యర్థి ఆర్.రాజేందర్, రాపెల్లి శ్రీనివాస్, స్వతంత్ర అభ్యర్థి సయ్యద్ అస్గర్ రెండోసెట్ నామినేషన్లు వేశారు. ఇప్పటివరకు 28 నామినేషన్లు దాఖలు అయ్యాయని రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నాలుగోరోజు.. 14మంది నామినేషన్సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి నాలుగో రోజు సోమవారం 14మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖల చేశారు. పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్కు వారు తమ నామినేషన్ పత్రాలు అందజేశారు. ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా మంద రమేశ్, స్వతంత్ర అభ్యర్థులుగా దుర్గం సమ్మయ్య,, ఆర్నకొండ రాజు, గడ్డం మారుతి, రాముల కార్తీక్, జుమ్మిడి గోపాల్, అంబాల మహేందర్, జనగామ నరేశ్, ముల్కల్ల రాజేంద్రప్రసాద్, దాగం సుధారాణి, జాడి ప్రేమ్సాగర్, అక్కపాక తిరుపతి ఒక్కోసెట్ నామినేషన్ పత్రం దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులు గద్దల వినయ్కుమార్, బొట్ల చంద్రయ్య రెండేసి సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో 25 మంది అభ్యర్థులు మొత్తంగా 31 సెట్ల నామినేషన్ పత్రాలు అధికారులకు అందజేశారు. ఈనెల 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం కాంగ్రెస్ అధికారంలోకొస్తే గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి తెలిపారు. రైతులను బీఆర్ఎస్, బీజేపీ పట్టించుకోలేదని, పసుపుబోర్డుపై అర్వింద్ ఉత్తర్వులతో సరిపెట్టారని పేర్కొన్నారు. గల్ఫ్ కార్మికులు మృతిచెందితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ. 5 లక్షల పరిహారం అందిస్తామని తెలిపారు. పసుపుబోర్డు నిజామాబాద్లో ఏర్పాటు చేస్తారా..? లేక అహ్మదాబాద్లో ఏర్పాటు చేస్తారా..? స్పష్టం చేయాల్సిన బాధ్యత అర్వింద్, బీజేపీపై ఉందన్నారు. నిజామాబాద్కు స్మార్ట్సిటీ తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
ఆ హీరోయిన్ నన్ను మునిగిపోకుండా కాపాడింది: టాలీవుడ్ హీరో
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
- బీజేపీలో చేరిన నటి రూపాలీ గంగూలీ
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
- పెళ్లయిన నెలకే విడాకులా? ఆ కామెంట్స్పై క్లారిటీ ఇచ్చిన నటి
- Hassan sex scandal: రాజుకుంటున్న పెన్డ్రైవ్
- లోకం చెడ్డదేం కాదు బాస్.. హార్ట్ టచింగ్ వీడియో
- ఏడు పదుల వయసులో ఇదేం కోరిక..ఏకంగా గర్ల్ఫ్రెండ్ కావాలంటూ..!
- స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్తో భార్య సర్ప్రైజ్
- కార్మిక సోదరులకు సీఎం జగన్ మే డే శుభాకాంక్షలు
- టీ20 వరల్డ్కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడికి నో ఛాన్స్
Advertisement