కాపర్‌వైర్‌ చోరీ కేసులో అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

కాపర్‌వైర్‌ చోరీ కేసులో అరెస్ట్‌

Published Thu, Apr 11 2024 8:35 AM

మాట్లాడుతున్న సీఐ వెంకటేశ్వర్లు - Sakshi

రామగిరి(మంథని): లద్నాపూర్‌ ఓసీపీ–2 వద్ద కాపర్‌వైర్‌ చోరీ చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు మంథని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో ఎస్సై సందీప్‌ కుమార్‌తో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఐ కథనం ప్రకారం.. నవాబ్‌పేట గ్రామానికి చెందిన పస్తాం తిరుపతి, సుల్తానాబాద్‌ మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన మోటం అజయ్‌ ఈనెల 5న లద్నాపూర్‌ ఓసీపీ–2 వద్ద కాపర్‌వైర్‌ చోరీ చేశారు. నాగేపల్లి చౌరస్తా వద్ద బుధవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా పస్తాం తిరుపతి, మోటం అజయ్‌ అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో పోలీసులు వారిని ఆపి సోదా చేశారు. ఈక్రమంలో వారివద్ద సుమారు 24 కిలోల కాపర్‌వైర్‌ లభించింది. దానివిలువ సుమారు రూ.85వేల వరకు ఉంటుంది. ఈమేరకు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచాక్యంగా వ్వవహరించిన సీఐ వెంకటేశ్వర్లుతోపాటు ఎస్సైలు సందీప్‌ కుమార్‌, పురుషోత్తం దివ్య, సిబ్బందిని గోదావరిఖని ఏసీపీ రమేశ్‌గౌడ్‌ అభినందించారు.

Advertisement
Advertisement